మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ రావడం లేదని, పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తేనే ఓపెనింగ్స్ వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Entertainment Apr 22, 2024, 5:56 PM IST
పూనమ్ కౌర్ సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. ఆమె తరచుగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తుంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆమె పరోక్షంగా సెటైర్ వేశారు.
Entertainment Apr 12, 2024, 6:21 PM IST
పిఠాపురంలో బషీర్ బీబీ ఔలియా దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ముస్లిం సోదరుల అభిమానం చూడండి
Andhra Pradesh Apr 3, 2024, 12:16 PM IST
వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు ఇవ్వకుండా ఆపటం చంద్రబాబు వల్ల కాదని .. గతంలో ఇంటింటికి పింఛను కార్యక్రమాన్ని ఆయన చేపట్టారా అని నాని నిలదీశారు. నిమ్మగడ్డకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసునని పేర్నినాని దుయ్యబట్టారు.
Andhra Pradesh Apr 1, 2024, 7:05 PM IST
రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల పొట్టకొట్టారని.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు కలెక్టర్లను కలిసి పింఛన్ సొమ్ము అందేలా చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు. కూటమి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
Andhra Pradesh Apr 1, 2024, 5:03 PM IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓట్లు, సీట్లు సాధించింది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి. మరి ఈసారి ఆ పార్టీ ఎలా వుంది? బలాలేమిటి? బలహీనతలేమిటి? తెలుసుకోండి.
Andhra Pradesh Mar 30, 2024, 8:58 PM IST
2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాజాం (ఎస్సీ) ఏర్పాటైంది. రాజాం నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014, 2019లలో వైసీపీలు గెలుపొందాయి. 2019లో కాంగ్రెస్ తరపున కొండ్రు మురళి.. 2014, 2019లలో వైసీపీ తరపున కంబాల జోగులు విజయం సాధించారు. రాజాంలో హ్యాట్రిక్ నమోదు చేయాలని వైపీపీ అధినేత , సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో వున్నారు. అయితే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులను కాదని, డాక్టర్ తేలే రాజేష్ను అభ్యర్ధిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విషయానికి వస్తే.. రాజాం నుంచి టీడీపీ పోటీ చేయనుంది. కానీ అభ్యర్ధి ఎవరన్నది ఇంత వరకు ప్రకటించలేదు .
Andhra Pradesh Mar 30, 2024, 8:51 PM IST
దేశంలో గిరిజనులు అధికంగా వుండే సెగ్మెంట్లలో పాలకొండ కూడా ఒకటి. పాలకొండ ప్రాంతానికి బ్రిటీష్ హయాం నుంచి చారిత్రక నేపథ్యం వుంది. పాలకొండలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్లు, వైసీపీ రెండేసి సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. మరోసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని కళావతి కృతనిశ్చయంతో వున్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి విషయానికి వస్తే.. పాలకొండ నుంచి జనసేన అభ్యర్ధి పోటీ చేయనున్నారు. కానీ నేటి వరకు ఇక్కడ అభ్యర్ధిని ప్రకటించలేదు. నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపురావడంతో ఆయన పోటీ ఖాయమని అంతా భావించారు.
Andhra Pradesh Mar 30, 2024, 7:53 PM IST
150 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి చీరలను 17వ శతాబ్ధంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి వెంకటగిరి నుంచి ప్రాతినిథ్యం వహించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇదే నియోజకవర్గంలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్ , వైసీపీ ఒకసారి గెలిచాయి. వెంకటగిరిలో విభిన్న పరిస్ధితులు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. వైసీపీ అభ్యర్ధిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ప్రకటించారు జగన్. కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియాకు టికెట్ కేటాయించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 30, 2024, 5:40 PM IST
ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట.. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,796 మంది. వీరిలో పురుషులు 1,15,896 మంది.. మహిళలు 1,21,878 మంది. భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ రెండు సార్లు గెలిచాయి. రెడ్డి, శెట్టి బలిజ, దళిత వర్గాల ఓటు బ్యాంక్ సూళ్లూరుపేటలో అధికం. సూళ్లూరుపేటలో పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతి నిశ్చయంతో వున్నారు. మరోసారి సంజీవయ్యకే టికెట్ కేటాయించారు. నెలవల విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ కేటాయించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 30, 2024, 3:41 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. పార్లమెంట్ తో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్ధుల వివరాలను నియోజకవర్గాల వారిగా అందిస్తున్నాం...
Andhra Pradesh Mar 29, 2024, 6:42 PM IST
విజయనగరం, విశాఖ జిల్లాలకు సరిగ్గా సెంటర్లో వుండటంతో పాటు రెండు జిల్లాలను అనుసంధానం చేస్తుంది శృంగవరపు కోట. ఈ సెగ్మెంట్ పరిధిలో కొప్పుల వెలమ, తూర్పు కాపులు, కొండ దొరలు, బగతలు బలంగా వున్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు శృంగవరపు కోట నుంచి ప్రాతినిథ్యం వహించారు. శృంగవరపు కోటలో టీడీపీకి కొప్పుల వెలమలు తొలి నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు. తూర్పు కాపుల్లో వైసీపీని ఆదరణ వుంది.. అయితే రాజుల మద్ధతు ఎటు వైపు వుంటే వారే శృంగవరపు కోటలో గెలుస్తారు. శృంగవరపు కోటలో వైసీపీ పట్టు నిలపాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి టికెట్ కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో గొంప కృష్ణ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Mar 29, 2024, 5:02 PM IST
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టర్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నఆమె.. పాలిటిక్స్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజం ఎంత..?
Entertainment Mar 29, 2024, 4:11 PM IST
ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పూసపాటి వంశీయులదే విజయనగరంలో ఆధిపత్యం. విజయరామ గజపతి రాజు, అశోక్ గజపతిరాజులు ఇక్కడ విజయాలు సాధిస్తూ వచ్చారు. అశోక్ గజపతి రాజు 1978లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎదురు లేకుండా సాగుతున్నారు. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఏడు సార్లు, కాంగ్రెస్ , సోషలిస్ట్ పార్టీలు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, జనతా పార్టీ, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి మరోసారి టికెట్ కేటాయించారు జగన్ . తన కుమార్తె అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు టికెట్ తెప్పించుకున్న అశోక్ ఆమెను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
Andhra Pradesh Mar 29, 2024, 4:05 PM IST
పవన్ కళ్యాణ్ విషయంలో అనసూయ మాట మార్చింది. నేను అలా అనలేదు అంటూ జన సైనికులకు ఝలక్ ఇచ్చింది. అనసూయ తీరు చర్చకు దారి తీసింది.
Entertainment Mar 29, 2024, 9:08 AM IST