నాలుగో రోజుకు చేరిన సీమ ‘ఇంటింటికి ఉక్కు ఉద్యమం’
జోరుగా సాగుతున్న కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నట్లు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని రాయలసీమ విద్యార్థి యువజనులు చేపట్టిన ‘ఇంటింటికి ఉక్కు ఉద్యమం’ నేడు నాలుగోరోజుకు చేరింది.
రెండేళ్లుగా సాగుతున్న ఈ ఉద్యమంలో ప్రతిఇంటినుంచిఒకరు పాల్గొని విజయవంతం చేసి ఈ ప్రాంతఅభివృద్ధికి తోడ్పాటు అందించాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు జి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రతి కుటుంబంలో చెబుతున్నారు.
అన్నివిధాల వెనకబడిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయాలని కేంద్రం మీద వత్తిడి తీసుకురావడంలో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆయన ప్రచారంలో చెబుతున్నారు. అందుకే ప్రజా ఉద్యమం నిర్మించి కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావాలని ఆయన ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.