Asianet News TeluguAsianet News Telugu

తన భర్త గతంలో ఓ మహిళ.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుసుకున్న భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఓ వివాహిత తన భర్త గతంలో మహిళ అని తెలుసుకుని షాక్‌కు గురైంది. పెళ్లి జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఈ విషయాన్ని తెలుసుకుంది. గతంలో మహిళగా ఉన్న తన భర్త.. సర్జరీ చేసుకున్నాడని, ఆ తర్వాత అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఎనిమిదేళ్ల కాలంలో అనేక సాకులు చెబుతూ సెక్స్ నుంచి తప్పించుకున్నాడు.
 

wife found her husband was once a woman after eight years of marriage
Author
First Published Sep 16, 2022, 8:02 PM IST

న్యూఢిల్లీ: ఓ భార్య ఎవరూ ఎదుర్కోని స్థితిని చవిచూసింది. మ్యాట్రిమోనియల్ సైట్‌లో వరుడిని చూసి మెచ్చి పెళ్లి చేసుకున్న ఆ వనిత.. ఎనిమిదేళ్ల తర్వాత ఖంగుతినే నిజాన్ని తెలుసుకుంది. తాను ఇన్నాళ్లు కలిసి ఉన్నది పురుషుడు కాదు అని... తాను భర్తగా స్వీకరించిన వ్యక్తి గతంలో మహిళ అనే విషయం తెలుసుకుని షాక్‌లో ఉండిపోయింది.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన 40 ఏళ్ల మహిళ దిమ్మదిరిగే నిజం తెలుసుకుంది. 2014లో తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. అబ్బాయి కాదు.. గతంలో అమ్మాయి అని ఆ భార్య తెలుసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. గుజరాత్‌లోని గోత్రి పోలీసు స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదైంది. ఓ మహిళ తన భర్తపై ఇచ్చిన ఫిర్యాదు అది. భర్త తనను చీట్ చేశాడని, అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో భర్త తల్లిదండ్రుల పేర్లనూ చేర్చింది.

తాను 2014లో విరాజ్ వర్దన్ అనే వ్యక్తిని మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కలుసుకున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. తన మొదటి భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తనతో 14 ఏళ్ల కూతురు ఉన్నది.

పోలీసుల వివరాల ప్రకారం, వారు 2014 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కశ్మీర్‌కు హనీమూన్‌కు కూడా వెళ్లారు. కానీ, వారు అక్కడ సంభోగించలేదని వివరించారు. సెక్స్ విషయంలో ఆమె భర్త తరుచూ అనేక కారణాలు, సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. సెక్స్ కోసం ఆమె ఒత్తిడి చేసినప్పుడు తాను కొన్నేళ్ల క్రితం రష్యాలో ఉన్నప్పుడు ఓ యాక్సిడెంట్ జరిగిందని, ఆ ప్రమాదంలో తాను సెక్స్ సామర్థ్యాన్ని కోల్పోయానని భర్త ఆమెకు చెప్పాడు. కానీ, ఒక చిన్న మైనర్ సర్జరీతో అన్నీ  చక్కబడతాయని నచ్చజెప్పాడు.

2020 జనవరిలో తాను కొంచెం సన్నబడటానికి ఓ సర్జరీ చేయించుకుంటున్నానని ఆమెకు చెప్పాడు. ఆ ప్రొసీజర్ కోసమే కోల్‌కతాకు వెళ్లుతున్నట్టు వివరించాడు. కానీ, ఆ తర్వాత అసలు విషయం ఆమెకు చెప్పాడు. తాను పురుషుల అవయవాలను ఇంప్లాంట్ చేసుకునే సర్జరీ చేయించుకున్నట్టు ఆమెకు తెలిపాడు. ఈ విషయాలన్నీ సదరు మహిళ పోలీసులకు తెలిపింది. అంతేకాదు, ఆ సర్జరీ గురించిన వివరాలేవీ తనకు ఇవ్వలేదని ఆమె వివరించింది. 

అప్పటి నుంచి అసహజ శృంగారానికి ఒత్తిడి చేశాడని, అలాగే, ఈ విషయం బయట ఎవరికి చెప్పినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. గోత్రి పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎంకే గుర్జార్ ఈ కేసు గురించి మాట్లాడుతూ, నిందితుడు ఢిల్లీ వాసి అని, ఆయనను వడోదరకు రప్పించామని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios