Asianet News TeluguAsianet News Telugu

భారత్, ఈఎఫ్టీఏ మధ్య వాణిజ్య ఒప్పందం.. 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం..

ఇండియా, నాలుగు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల రాబోయే 15 ఏళ్ల భారత్ కు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడు వచ్చే అవకాశం ఉంది. అలాగే దీని వల్ల 10 లక్షల ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.

The trade agreement between India and EFTA.. the target is 100 billion dollars investment in 15 years..ISR
Author
First Published Mar 10, 2024, 6:40 PM IST

భారత్, నాలుగు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) దేశాలైన ఐస్లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా)పై సంతకాలు చేశాయి. ఇండియా, ఈఎప్టీఏ మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం జరగడం వల్ల వచ్చే 15 సంవత్సరాలలో ఆ దేశాల నుంచి మన దేశానికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పది లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. 

బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలి - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

దీనిని అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు, ఐరోపా దేశాలతో భారత్ కుదుర్చుకున్న తొలి ఒప్పందంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. 16 ఏళ్ల చర్చల అనంతరం సమతూకంతో కూడిన ఒప్పందం కుదిరిందని చెప్పారు. టీఈపీఏ ఐపీఆర్, పర్యావరణం, వాణిజ్యం, లింగం వంటి ఆధునిక అంశాలను కవర్ చేస్తుందని, పునరుజ్జీవన భారత్ ను ప్రతిబింబిస్తుందని గోయల్ తెలిపారు.

కాగా.. భారత్, ఈఎఫ్టీఏ సభ్య దేశాలు 2008 నుంచి టెపాపై చర్చలు జరుపుతున్నాయి. చర్చల్లో భాగంగా స్విస్ కంపెనీల దేశీయ తయారీ, పెట్టుబడులకు వీలు కల్పించే లక్ష్యంతో ఈ ఒప్పందంలో భాగంగా సేవలను చేర్చాలని భారత్ కోరింది. స్విట్జర్లాండ్ ఇప్పటికే దాదాపు అన్ని వస్తువులపై జీరో కస్టమ్స్ డ్యూటీ విధించగా, వస్తువులపై జీరో డ్యూటీని సమతుల్యం చేయడానికి, బేరసారాల్లో భారత ప్రయోజనాలను పరిరక్షించడానికి పెట్టుబడులపై నిబద్ధతను భారత్ కోరింది.

టెపాపై సంతకం చేయడానికి ముందు, ఈఎఫ్టీఏ సమూహం 35 కి పైగా భాగస్వామ్య దేశాలతో 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉంది. ఈఎఫ్టీఏ దేశాలు యూరోపియన్ యూనియన్ లో భాగం కాదు. అయితే ప్రస్తుతం భారతదేశంతో అనుకూలమైన వాణిజ్య సమతుల్యతను అనుభవిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈఎఫ్టీఏ దేశాలకు భారతదేశం ఎగుమతులు 1.92 బిలియన్ డాలర్లు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఈఎఫ్టీఏ దేశాల నుండి 16.74 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలను దిగుమతి చేసుకుంది.

ఎన్నికల కమిషనర్ రాజీనామాకు కారణమేంటో ప్రభుత్వమే చెప్పాలి - అసదుద్దీన్ ఒవైసీ

వస్తుసేవల వాణిజ్యం, మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్), పెట్టుబడుల ప్రోత్సాహం, సహకారం, మూల నియమాలు, వాణిజ్య సౌలభ్యం, వాణిజ్యం, సుస్థిర అభివృద్ధి సహా పలు అంశాలపై భారత్, ఈఎఫ్టీఏ చర్చలు జరిపాయి. ఈఎఫ్టీఏ సభ్యదేశం స్విట్జర్లాండ్ భారతదేశం అతిపెద్ద బంగారం దిగుమతుల వనరు, భారతదేశంతో భారీ వాణిజ్య మిగులును కలిగి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్విట్జర్లాండ్తో భారత్ 14.45 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును కలిగి ఉంది, నికర దిగుమతులు 15.79 బిలియన్ డాలర్లు, నికర ఎగుమతులు 1.34 బిలియన్ డాలర్లుగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios