జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దుతో పండితులు సంబరాలు చేసుకొన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ లను వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
న్యూఢిల్లీ: 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూలో పండింట్లు సోమవారం నాడు సంబరాలు చేసుకొన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన వెంటనే పండింట్లు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్పై నిర్ణయం తీసుకొనేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేసింది. వారం రోజులుగా సాగుతున్న పరిణామాలు కాశ్మీర్పై కేంద్రం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానించారు.
అందరూ ఊహించినట్టుగానే కాశ్మీర్కు కల్పించిన స్వయంప్రతిపత్తి అధికారాలు 370 ఆర్టికల్ రద్దుతో కోల్పోతారు. ఈ ఆర్టికల్ రద్దు చేయడంతో పండితులు సంబరాలు చేసుకొన్నారు.దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండితులు సంబరాలు చేసుకొన్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో పండితులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకొన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని తమ నృత్యం చేస్తూ తమ హర్సాన్ని వ్యక్తం చేశారు.
కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?
స్వయం ప్రతిపత్తి రద్దు: మూడు ముక్కలైన కాశ్మీర్, గెజిట్ విడుదల
జమ్మూకశ్మీర్పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్డేట్స్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 5, 2019, 1:26 PM IST