కత్తితో బెదిరించి మైనర్ బాలిక కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్.. నగ్నచిత్రాలు తీసి...
పొడుస్తామని బెదిరించి 15యేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి.. తన స్నేహితులతో కలిసి ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర : మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను కత్తితో బెదిరించి, కిడ్నాప్ చేసి ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన చోటు చేసుకుంది. 15యేళ్ల ఆ మైనర్ బాలికపై బాలిక పై కామంతో కళ్లు మూసుకుపోయిన ఆరుగురు నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. అయితే ఈ ఆరుగురు నిందితుల్లో ఒకరు బాధితురాలికి అంతకు ముందే పరిచయం ఉన్న వ్యక్తి. ఆ అమ్మాయిని కత్తితో పొడుస్తామని చెప్పి బెదిరించారు. ఆ తరువాత కిడ్నాప్ చేశారు.
భయపెట్టి ఆమెను లాడ్జికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాధితురాలిని నగ్నం ఫోటోలు కూడా తీశారు. తాము సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం ఎవరికైనా చెబితే ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని చెప్పి బెదిరించారు. అయితే ఈ మేరకు వివరాలు వెల్లడించిన పోలీసులు అత్యాచారం ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. జూన్ - డిసెంబర్ మధ్యలో ఈ అత్యాచార ఘటన జరిగి ఉంటుందని మాత్రమే తెలిపారు.
2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంత మంది మరణించారు? ఎన్ హెచ్ఏఐ రిపోర్టు ఏం చెప్పుతోంది..?
తర్వాత ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లికి విషయాన్ని తెలపడంతో.. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారందరి పై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దీంతోపాటు భారతీయ శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలోని యమునా ఎక్స్ప్రెస్వే సమీపంలో బుధవారం తెల్లవారుజామున 23 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆగ్రా పోలీస్ కమిషనర్ ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ నోయిడా నుండి ఔరయ్యాకు షేర్డ్ ప్రైవేట్ టాక్సీలో ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
“ఆ మహిళ బుధవారం ఉదయం ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. యమునా ఎక్స్ప్రెస్వేలో తనపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు నోయిడా సెక్టార్ 37లో ట్యాక్సీ ఎక్కినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో "క్యాబ్లో ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు" అని ఆమె పేర్కొంది.
ఎక్స్ప్రెస్వే ముగుస్తున్న కుబేర్పూర్ ఎక్స్ఛేంజ్లో ఇతర ప్రయాణికులు దిగారని, కాన్పూర్ సమీపంలోని ఔరయ్యకు వెళ్లాల్సి ఉన్నందున, డ్రైవర్ తనను ఫిరోజాబాద్లో డ్రాప్ చేస్తానని చెప్పాడని ఆ మహిళ తెలిపింది. ఆ తరువాత డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులక పోన్ చేసి.. పిలిచాడు. తరువాత వారిద్దరూ ఎత్మద్ పుర్ సమీపంలో కారు ఎక్కారు. ఆ తరువాత ముగ్గురూ కలిసి కారు యమునా ఎక్స్ ప్రెస్ వే దగ్గరికి రాగానే ఆపేసి.. ఆమెను రోడ్డు పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లారు.
ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమెను ఎత్మద్ పూర్ దగ్గర వదిలిపెట్టారు. ఘటన షాక్ నుంచి తేరుకున్న ఆమె ఎలాగోలా ఓ ఆటోను పట్టుకుని ఫిరోజాబాద్ కు వెళ్లిపోయింది. బుధవారం ఉదయం ఎత్మద్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టోల్ ప్లాజా దగ్గరున్న సీసీటీవీ కెమెరాల్లో ట్యాక్సీని గుర్తించారు పోలీసులు. వారిని పట్టుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.