ఎఫైర్: ఆ సంబంధం కోసం ఇంటికొస్తే... దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ
వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధించిన మాజీ ప్రియుడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది.
కర్నూల్: వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధించిన మాజీ ప్రియుడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. మృతదేహన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూల్ మండలంలోని నిడ్జూరు గ్రామానికి చెందిన గొల్ల విజయుడుకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉంది. విజయుడుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఐదేళ్ల క్రితం నుండి విజయుడితో ఆ మహిళ వివాహేతర సంబంధాన్ని తెంచేసుకొంది.
అయితే విజయుడు మాత్రం తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఆమెను వేధించడం ప్రారంభించాడు. అయితే ఆమె మాత్రం వినలేదు. ఆగష్టు 14 వ తేదీ రాత్రి విజయుడు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు.
తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. కోపంతో ఆ మహిళ రోకలిబండతో విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు కత్తితో పొడించింది. ఇంటికి తాళం వేసి పారిపోయింది. ఆ తర్వాత బుధవారం సాయంత్రం ఆమె పోలీసులకు లొంగిపోయింది.నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు చదవండి
పదేళ్లుగా లవ్: మరో యువతితో పెళ్లి, మాజీ లవర్పై రేప్
పెళ్లైన మహిళలే టార్గెట్: 10 మందికి కారులో లిఫ్టిచ్చి రేప్
భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు
ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు కోసి చంపిన భార్య
రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు
అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి