పాకిస్తాన్ సైనిక చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్ గౌరవం దక్కింది. ఈ హోదా కేవలం పాక్ ఆర్మీలోనే కాదు ఇండియన్ ఆర్మీలోనూ ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఎవరికి ఈ హోదా దక్కిందంటే..
India Pakistan : పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కి 'ఫీల్డ్ మార్షల్' గౌరవం ఇచ్చింది. ఫీల్డ్ మార్షల్ అంటే ఏమిటి? పాకిస్తాన్లో ఈ హోదా ఇప్పటివరకు ఎవరెవరికి దక్కింది? భారత ఆర్మీలోనూ ఈ ఫీల్డ్ మార్షల్ హోదా ఉందా? ఉంటే ఇప్పటివరకు ఎవరికి దక్కింది? తెలుసుకుందాాం.
జనరల్ ఆసిమ్ మునీర్: పాకిస్తాన్ నిషాన్-ఎ-ఇమ్తియాజ్ మిలిటరీ
దేశ భద్రత, శత్రువులకు వ్యూహాత్మకంగా స్పందించినందుకు జనరల్ ఆసిమ్ మునీర్ (నిషాన్-ఎ-ఇమ్తియాజ్ మిలిటరీ)కి ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఫీల్డ్ మార్షల్ అంటే ఏమిటి?
సైన్యంలో అత్యున్నత హోదా ఫీల్డ్ మార్షల్. ఐదు స్టార్లతో గుర్తిస్తారు. సాధారణంగా యుద్ధంలో ధైర్యసాహసాలు, అసాధారణ సేవలకు ఇస్తారు. భారత్, పాకిస్తాన్లో ఈ హోదా సాంకేతికమే. ప్రత్యక్ష సైనిక నియంత్రణ ఉండదు.
భారత్లో ఎవరికి ఫీల్డ్ మార్షల్ హోదా దక్కింది?
భారత్లో ఇద్దరికే ఈ గౌరవం దక్కింది.
సామ్ మానెక్షా (1973): 1971 భారత్-పాక్ యుద్ధ విజయం, బంగ్లాదేశ్ ఏర్పాటులో పాత్రకు.
కె.ఎం. కార్యప్ప (1986): స్వాతంత్య్రం తర్వాత తొలి భారతీయ సైనిక చీఫ్గా అత్యుత్తమ సేవలకు.
పాకిస్తాన్లో ఇద్దరు ఫీల్డ్ మార్షల్లు
జనరల్ అయూబ్ ఖాన్ (1959): అధికారంలోకి వచ్చి ఈ హోదా పొందారు. ఆయన హయాంలో 1965 భారత్-పాక్ యుద్ధం జరిగింది.
జనరల్ ఆసిమ్ మునీర్ (2024): ఇటీవలి భారత్-పాక్ ఉద్రిక్తతల్లో నాయకత్వానికి ఈ గౌరవం.
ఫీల్డ్ మార్షల్ అయ్యాక జనరల్ మునీర్ స్పందన
ఇది తన విజయమే కాదు పాకిస్తాన్ సైన్యం, దేశ ప్రజల సాధించిన విజయమని జనరల్ మునీర్ అన్నట్లు పాక్ సైన్య ప్రచార విభాగం ISPR తెలిపింది. పాకిస్తాన్లో సైన్యం, ప్రభుత్వ సంబంధాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.