Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లోనే తండ్రి వ్యభిచారం.. తట్టుకోలేక కొడుకు ఏంచేశాడంటే

కుటుంబసభ్యలు అందరినీ బలవంతంగా ఇంట్లో నుంచి తరిమి కొట్టి..ఇంట్లోనే వ్యభిచారం పెట్టాడు. తండ్రి చేస్తున్న పనిచూసి విసిగెత్తిపోయిన కొడుకు.. ఆ తండ్రినే హత్య చేశాడు.

Dispute ends with son killing father slaying
Author
Hyderabad, First Published Sep 18, 2018, 12:19 PM IST

కుటుంబసభ్యలు అందరినీ బలవంతంగా ఇంట్లో నుంచి తరిమి కొట్టి..ఇంట్లోనే వ్యభిచారం పెట్టాడు. తండ్రి చేస్తున్న పనిచూసి విసిగెత్తిపోయిన కొడుకు.. ఆ తండ్రినే హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం మక్కల్ జిల్లా సేడమంగళంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..సేడ మంగళం సమీపం పోలుకురిచ్చిలో దంపతులు పెరియసామి (45), మణిమేఖలై నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెరియసామి ట్రాక్టర్‌ డ్రైవర్‌ పనిచేస్తూ రోజూ పీకల దాకా తాగి ఇంటికొచ్చి భార్యాపిల్లలతో గొడవపడుతుండేవాడు. తాగుడు మానమంటూ సలహా ఇచ్చిన కొడుకులను చితకబాదేవాడు. అంతేకాదు భార్యాపిల్లలను ఇంటి నుంచి ఇటీవల తరిమివేశారు. ఆ తర్వాత రోజూ ఇంటిలో ఇతర స్ర్తీలతో వ్యభిచారం చేయడం ప్రారంభించారు.
 
    ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పెరియసామి ఇంటి తలుపులు తెరచి ఉండటం, లోపల నుంచి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటిలో పోలీసులు పరిశీలించగా పెరియ సామి వంటి నిండా కత్తిపోటు గాయాలతో శవంగా పడిఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తులెవరూ అతడిని హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. 

ఆ తర్వాత పెరియసామి భార్య, కుమారుల వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఆ విచారణలో తన తండ్రిని తానే కత్తితో పొడిచి హత్యచేశానని కొడుకు అజిత్ అంగీకరించారు. ఇంటి నుంచి తమను తరిమికొట్టిన తర్వాత పెరియ సామి రోజూ ఇంటిలో ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు నెరుపుతున్నాడని తెలిసి ఈ హత్య చేసినట్లు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios