దారుణం.. శృంగారం నిరాకరించిందని భార్యను హతమార్చిన భర్త.. ఎక్కడంటే ?
సెక్స్ లో పాల్గొనేందుకు నిరాకరించిందని భార్యను ఓ భర్త హతమార్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
శృంగారానికి నిరాకరించిందని ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. యవత్మాల్ జిల్లాలోని పోఫాలీ పోలీస్స్టేషన్ పరిధిలో సంజయ్ తన భార్య సాఖారేతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం దంపతుల ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఢిల్లీ దారుణం: కారు కింద యువతి ఇర్కుకుపోయిందని తెలిసి కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
శృంగారంలో పాల్గొనాలనే కోరికను భార్య నిరాకరించడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఇది ముదిరి తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో క్షణికావేశంలో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఛాతీపై రాయితో కొట్టాడు. భార్య చనిపోయిన తరువాత ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు డెడ్ బాడీని కాల్చేశాడు.
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీపై వస్తున్న దంపతులను ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సబ్ డివిజనల్ పోలీసు అధికారి ప్రదీప్ పద్వీ, ఎస్హెచ్ఓ రాజీవ్ హకే, ఎస్హెచ్ఓ బితార్గావ్ ప్రతాప్ భోష్, ఎస్పీ సంగల్ స్తగుషా, సబ్ ఇన్స్పెక్టర్లు రాజేష్ పండిట్ గణేష్ రాథోడ్ అక్కడి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు సంజయ్పై కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. అనంతరం ఒక రోజు పోలీసు కస్టడీకి తరలించారు.
టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏమిటీ దాని నేపథ్యం ?
ఇలాంటి ఘటనే పూణెలో కూడా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఓ వివాహిత కత్తితో పొడిచి హత్యకు గురైంది. నిందితుడిని జైరామ్ ఉత్తరేశ్వర్ చౌరేగా గుర్తించారు. నిందితుడు బీడ్ జిల్లాకు చెందిన సూరజ్ గోలు ధాటేతో పాటు అతని సహచరుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మృతుడు రూపాంజలి సంభాజీ జాదవ్గా గుర్తించారు.