ఎగదోసి బాలికను రేప్ చేయించి, హత్య చేయించిన ఆంటీ
అత్యాచారం చేసిన తర్వాత బాలిక తలపై రాళ్లతో మోది ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన భోపాల్ లో మంగళవారంనాడు చోటు చేసుకుంది. తన 16 ఏళ్ల ఆంటీతో కలిసి బాలిక ఆలయానికి వెళ్లింది. వారిని ఇద్దరు వ్యక్తులు అనుసరించారు.
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు 12 బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత అతి కిరాతకంగా చంపేశారు. వారిని ఆంటీ ప్రోత్సహించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు వ్యక్తులు బాలిక అంటీకి తెలుసునని, ఆమె ప్రమేయం కూడా నేరంలో ఉందని భావిస్తున్నారు.
అత్యాచారం చేసిన తర్వాత బాలిక తలపై రాళ్లతో మోది ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన భోపాల్ లో మంగళవారంనాడు చోటు చేసుకుంది. తన 16 ఏళ్ల ఆంటీతో కలిసి బాలిక ఆలయానికి వెళ్లింది. వారిని ఇద్దరు వ్యక్తులు అనుసరించారు.
ఆ ఇద్దరు వ్యక్తులు బాలికను సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. బాలికను దుండగులు తీసుకుని వెళ్లిన సమయంలో ఆంటీ పక్కన లేదు.
ఈ సంఘటనపై బిజెపి నేతలు కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆ ఇద్దరితో పాటు మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.