Asianet News TeluguAsianet News Telugu

అడ్రస్ చెప్పమంటూ కిడ్నాప్ .. 15 ఏళ్ల బాలికపై కారులోనే గ్యాంగ్‌ రేప్, డీఎస్పీ రాకుంటే

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణం జరిగింది. ఓ 15 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఐదుగురు దుండగులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా విషయం వెలుగు చూసింది. 

15 year old girl gang raped by 5 men in car in Ranchi
Author
Ranchi, First Published May 13, 2022, 7:35 PM IST

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా దేశంలో మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. అపరిచిత వ్యక్తులు, తెలిసిన వారి చేతుల్లోనే అబలలు అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా ఝార్ఖండ్‌లో (jharkhand) ఓ పాఠశాల విద్యార్ధిని బలవంతంగా కారులో ఎక్కించి ఆమెపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు పెట్రోలింగ్ (police patrolling) నిర్వహిస్తుండటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం రాష్ట్ర రాజధాని రాంచీ (ranchi) నగరంలో బాలిక ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఐదుగురు దుండగులు కారులో ఆమెను అనుసరించారు. కొద్ది దూరం వెళ్లాక అడ్రస్​ చెప్పాలంటూ ఆమెను కోరారు... అనంతరం కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. రాతూ స్టేషన్​ సమీపంలోని ఓ రెస్టారెంట్​ సమీపంలో కారులోనే అగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే రాత్రి పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న డీఎస్​పీ అంకిత (dsp ankitha) .. అనుమానాస్పదంగా ఉన్న కారును గమనించారు. 

వెంటనే అక్కడికి వెళ్లి కారును తనిఖీ చేశారు. అందులో ఐదుగురు యువకులు అభ్యంతకర రీతిలో కనిపించటం, వారి మధ్యలో బాలిక ఏడుస్తూ ఉండటాన్ని గమనించారు. దీంతో విషయం అర్ధం చేసుకున్న అంకిత.. వెంటనే ధుర్వ స్టేషన్​ ఇంఛార్జ్​ ప్రవీణ్ ఝాకు ఫోన్​ చేసి అదనపు బలగాలను పంపించాలని ఆదేశించారు. డీఎస్పీ ఆదేశంతో అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో ఐదుగురు నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితుల్లో పలువురు వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులుగా గుర్తించామన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios