Butter Milk: ఎండలు మండిపోతున్నా కూడా వీళ్లు మజ్జిగ తాగకూడదు..!
మజ్జిగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కానీ, కొందరికి మాత్రం మజ్జిగ హానికరం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మజ్జిగ ఎవరికి మంచిది కాదు?
ఎండాకాలంలో వేడి తాపం తగ్గించుకోవడానికి, శరీరాన్ని చల్లపరిచేందుకు ఎక్కువగా డ్రింక్స్ తాగుతూ ఉంటాం. వాటిలో కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ ముందు వరసలో ఉంటాయి. వీటిని తాగడం వల్ల శీరరం చల్లపడటమే కాకుండా, డీ హైడ్రేషన్ సమస్య అనేది ఉండదు. పెరుగు, నీరు కలిపి తయారు చేసే మజ్జిగలో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ మజ్జిగను మాత్రం కొందరు అస్సలు తాగకూడదని మీకు తెలుసా? బయట ఎండలు ఎంత మండిపోతున్నా కూడా వీరు మజ్జిగ తాగకూడదు. మరి, ఎవరు తాగకూడదో తెలుసుకుందామా...
మజ్జిగ ఎవరు తాగకూడదు?
అందరికీ పాలు, పాల ఉత్పత్తులు, మజ్జిగ లాంటివి సరిగా జీర్ణం అవ్వవు. పాలలో ఉండే లాక్టోస్ అందరికీ సెట్ అవ్వదు. దీని వల్ల పాల ఉత్పత్తులు తీసుకున్నప్పుడు కడుపులో నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. మజ్జిగ కూడా పాలతోనే తయారౌతుంది కాబట్టి.. అలాంటి సమస్య ఉన్నవారు మజ్జిగ తాగకుండా ఉండటమే మంచిది
పాల అలెర్జీలు ఉన్నవారు..
చాలా మందికి పాలు, పాల ఉత్పత్తులతో అలర్జీ ఉంటుంది. అలాంటివారు కూడా మజ్జిగ తాగకుండా ఉండటమే మంచిది. పొరపాటున తాగితే వారి చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీరు కూడా మజ్జిగ తాగకూడదు.
జలుబు , దగ్గుతో బాధపడేవారు
ఆయుర్వేదం ప్రకారం, మజ్జిగ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో శ్లేష్మం మొత్తాన్ని పెంచుతుంది. అందువల్ల, జలుబు, జ్వరం లేదా దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల విషయంలో దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మజ్జిగ తాగడం వల్ల గొంతు నొప్పి లేదా శ్లేష్మం పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి, దీనివల్ల దగ్గు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమయంలో కూడా మజ్జిగ తీసుకోకపోవడమే మంచిది.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు
ఇప్పటికే బలహీనంగా ఉన్న లేదా అనారోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉన్న వ్యక్తులు మజ్జిగ తాగిన తర్వాత కడుపులో చికాకు, బరువు తగ్గడం, అజీర్ణం లేదా తిమ్మిరి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మజ్జిగలోని ఆమ్ల లేదా శీతలీకరణ ప్రభావం వారి జీర్ణవ్యవస్థను మరింత చికాకుపెడుతుంది, దీని వలన గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ లేదా కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు, భారీ భోజనం చేసిన తర్వాత కూడా మజ్జిగ తాగకూడదు.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు
మజ్జిగలో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి నార్మల్ గా ఆరోగ్యానికి మంచివే. కానీ, ఎవరికైనా మూత్ర పిండాల సమస్య ఉంటే వారికి మాత్రం ఇవి ప్రమాదకరం. అందుకే.. మూత్ర పిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారు మజ్జిగ లాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు
కీళ్ల నొప్పులతో బాధపడేవారు మజ్జిగ తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం, మజ్జిగ శీతలీకరణ ప్రభావం కీళ్ల వాపు మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థరైటిస్ లక్షణాలతో బాధపడుతున్న వారు అయితే మజ్జిగకు దూరంగా ఉండటం చాలా అవసరం.