MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Hot Water: భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగితే ఏమౌతుంది?

Hot Water: భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగితే ఏమౌతుంది?

Hot Water: కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు భోజనం తర్వాత వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? 

1 Min read
ramya Sridhar
Published : Nov 18 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేడి నీళ్లు.....
Image Credit : stockphoto

వేడి నీళ్లు.....

మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, మంచినీళ్లు కూడా అంతే అవసరం. దాహం వేసిన ప్రతిసారీ మనం నీరు తాగుతాం. అంతేకాకుండా, చాలా మంది భోజనం చేయడానికి ముందు లేదంటే.. భోజనం చేసిన తర్వాత మంచి నీళ్లు తాగుతూ ఉంటారు. కానీ, భోజనం చేసిన ప్రతిసారీ వేడి నీళ్లు తాగే అలవాటు మీకు ఉందా? అసలు  ఇలా ఎందుకు తాగాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం…..

24
భోజనం అతిగా తిన్నప్పుడు...
Image Credit : our own

భోజనం అతిగా తిన్నప్పుడు...

మనలో చాలా మందికి అతిగా తినే అలవాటు ఉంటుంది.  ఇలా అతిగా తిన్నప్పుడు, ముఖ్యంగా చికెన్, మటన్ లాంటి మాంసాహారం కడుపునిండా తిన్న తర్వాత ఆ ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది .  ఆహారం సులభంగా జీర్ణం కాని సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో కేవలం హాట్ వాటర్ తాగితే సరిపోతుందని మీకు తెలుసా?

భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత వేడి నీళ్లు తాగాలి. ఒకేసారి ఎక్కువగా కాకుండా, కొంచెం కొంచెంగా కాస్త విరామం ఇచ్చి తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

Related Articles

Related image1
Walnuts: వాల్ నట్స్ రాత్రిపూట నానపెట్టి.. ఉదయాన్నే తింటే ఏమౌతుంది?
Related image2
Food: వీటిని నానపెట్టిన తర్వాతే వండాలి, ఎందుకో తెలుసా?
34
వేడి నీళ్లు ఎందుకు మంచిది?
Image Credit : our own

వేడి నీళ్లు ఎందుకు మంచిది?

తిన్న తర్వాత వేడినీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరంలో జీవక్రియలు కూడా జరుగుతాయి. ఇంకా శరీరం ఆహారం నుంచి పోషకాలను గ్రహించడం సులభం అవుతుంది. ఫలితంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

అంతేకాకుండా, వేడినీళ్లు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట ద్వారా విష పదార్థాలు బయటకు పోతాయి. శరీరంలోని టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి. ఇంకా రక్త ప్రసరణ చురుగ్గా ఉండటం వల్ల రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు.

44
గుర్తుంచుకోవాల్సిన విషయం...
Image Credit : our own

గుర్తుంచుకోవాల్సిన విషయం...

తిన్న తర్వాత వేడినీళ్లు తాగొచ్చు. కానీ మరీ ఎక్కువ వేడితో తాగొద్దని గుర్తుంచుకోండి. గోరువెచ్చని నీటిని తాగాలి. మామూలు వేడినీళ్లకు బదులుగా, అందులో కొన్ని పుదీనా, తులసి ఆకులు వేసుకుని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
ఈజీగా బరువు తగ్గాలా? రోజూ ఇవి తిన్నా చాలు
Recommended image2
Kitchen Hacks: ఉదయం చేసిన రోటీలు.. రాత్రికి కూడా మెత్తగా ఉండాలా? ఇవి ఫాలో అయితే చాలు
Recommended image3
Walnuts: వాల్ నట్స్ రాత్రిపూట నానపెట్టి.. ఉదయాన్నే తింటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Walnuts: వాల్ నట్స్ రాత్రిపూట నానపెట్టి.. ఉదయాన్నే తింటే ఏమౌతుంది?
Recommended image2
Food: వీటిని నానపెట్టిన తర్వాతే వండాలి, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved