COVID19: ఈ సూపర్ఫుడ్స్ తో కరోనా వైరస్ కి చెక్ పెట్టండి!
దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరి ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవడం అవసరం. అందుకు తీసుకోవాల్సిన ఆహారాలెంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు
కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి పెద్ద నగరాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే బలమైన రోగనిరోధక శక్తి అవసరం. అందుకు తీసుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు
కమలా, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. నిపుణుల ప్రకారం మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాములు, పురుషులకు 90 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరం ఉంటుంది.
ఉసిరికాయ
ఉసిరికాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరికాయను నేరుగా తినవచ్చు. దాని రసం కూడా తాగవచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి.. వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
పెరుగు
పెరుగులో కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మీరు పెరుగును నేరుగా తీసుకోవచ్చు. పెరుగుకు కొన్ని పండ్లు లేదా తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. పండ్లు, తేనే కలపడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది.
బాదం
బాదం విటమిన్ E కి మంచి మూలం. ఇది యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రోజుకు 4 నుంచి 6 బాదంపప్పులు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ E లభిస్తుంది.