2025లో 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు ?
6 Highest Paid South Actresses: ఒకప్పుడు హీరోయిన్లకు పెద్దగా రెమ్యునరేషన్లు ఉండేవి కాదు. కాని ప్రస్తుతం హీరోలకు పోటీగా వారు కూడా డిమాండ్ చేసి మరీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ఈక్రమంలో 2025 లో 10 నుంచి 20 కోట్లు అందుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.

6 Highest Paid South Actresses: : 2024లో నయనతార, త్రిష ఇలా సీనియర్ హీరోయిన్లు రెమ్యునరేషన్ లో ముందున్నారు. పోటీ పడి మరీ 10 నుంచి 15 కోట్ల వరకూ వసలు చేశారు. కాని ఇప్పుడు ఈ ఇద్దరిని పక్కాకు నెడుతూ.. 20 కోట్ల మార్క్ ను చేరుకుంది ఓ హీరోయిన్. అంతే కాదు 2025లో సౌత్ నుంచి 10 కోట్లకు పైగా జీతం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లు ఎవరు చూద్దాం.
Also Read: సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?
6. పూజా హెగ్డే
ఎక్కువ జీతం తీసుకునే హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే 6వ స్థానంలో ఉంది. ఈమె సినిమాకు రూ.7 కోట్ల వరకు తీసుకుంటోందట. తెలుగులో అవకాశాలు రాకపోడంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది బ్యూటీ. కోలీవుడ్ లో ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్ అంటే అది పూజా హెగ్డేనే. ఈమె చేతిలో విజయ్తో 'జననాయకన్', సూర్యతో రెట్రో, రాఘవా లారెన్స్ తీసే 'కాంచన 4' సినిమాలు ఉన్నాయి.
Also Read: బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
5. సమంత
సమంతకు గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమాలు లేకపోయినా ఆమె క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా నటిస్తోంది సమంత. ఇది కాకుండా తెలుగులో 'బంగారం' అనే సినిమాను నిర్మిస్తూ అందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈమె నటించిన చివరి సినిమా 'సిటాడెల్' వెబ్ సిరీస్. దాని కోసం రూ.10 కోట్లు తీసుకుంది సమంత.
Also Read: అల్లు అర్జున్ కు షాక్ , పుష్ప2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఛావా మూవీ, ఎలా సాధ్యం అయ్యింది?
4. త్రిష
ఎక్కువ జీతం తీసుకునే హీరోయిన్ల లిస్టులో గత ఏడాది అంటే 2024 లో నంబర్ 1 స్థానంలో ఉన్న త్రిష, ఈ ఏడాది నాలుగో స్థానానికి పడిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', మణిరత్నం తీసిన 'తగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', ఆర్.జె. బాలాజీ తీసే 'సూర్య 45' సినిమాలు ఉన్నాయి. ఇందులో 'విశ్వంభర' సినిమా కోసం రూ.12 కోట్లు తీసుకుందట త్రిష.
Also Read: మోహన్ బాబు వల్ల బోల్తా కొట్టిన చిరంజీవి సినిమా, బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన మెగా మూవీ ?
3. రష్మిక మందన్న
రష్మిక మార్కెట్ 'పుష్ప 2' సినిమా హిట్ తర్వాత రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఆ తర్వాత ఆమె నటించిన చారిత్రక సినిమా 'చావా' బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కలిసి 'సికందర్' అనే సినిమాలో నటిస్తున్న రష్మిక, ఆ సినిమా కోసం రూ.13 కోట్లు తీసుకుందట.
Also Read: 46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్
2. నయనతార
నయనతారకు 40 ఏళ్లు వచ్చినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటిస్తున్న 'టెస్ట్', 'టాక్సిక్', 'డియర్ స్టూడెంట్', 'మన్నాంగట్టి', 'రాకాయి', 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సుందర్ సి దర్శకత్వంలో 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న 'మూకుత్తి అమ్మన్ 2' సినిమా కోసం రూ.15 కోట్లు తీసుకుందట నయనతార.
1. సాయి పల్లవి
2024 వరకు సాయి పల్లవి సినిమాకు రూ.5 కోట్లు మాత్రమే తీసుకునేది. 'అమరన్, తండేల్ సినిమాల హిట్ తర్వాత ఆమె మార్కెట్ రాకెట్ వేగంతో పెరిగిపోయింది. ఈ సినిమాల హిట్ తర్వాత బాలీవుడ్కు వెళ్లిన సాయి పల్లవి అక్కడ 'రామాయణం' సినిమాలో సీతగా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఈమె ప్రస్తుతం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా సౌత్ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది.