- Home
- Entertainment
- Reshma Rathore: సినిమాలకు గుడ్ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్ హీరోయిన్.. డేరింగ్ స్టెప్
Reshma Rathore: సినిమాలకు గుడ్ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్ హీరోయిన్.. డేరింగ్ స్టెప్
Reshma Rathore: సినిమా గ్లామర్, స్టార్డమ్ వదులుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ, ఓ హీరోయిన్ మాత్రం నటనకు గుడ్బై చెప్పి, ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అయ్యింది.

యాక్టింగ్కి గుడ్ బై చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
సినిమా రంగంలో గ్లామర్, పేరుప్రఖ్యాతలు ఉంటాయి. కెమెరా ముందుకొచ్చి చప్పట్లు కొట్టించుకున్న వాళ్లు ఆ ప్రపంచాన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు ఉన్నా, లేకపోయినా వదల్లేరు. అలాంటి పరిస్థితి వస్తే అది ఎంతో స్ట్రగుల్తో కూడుకొన్నదే అవుతుంది. కానీ, తెలుగు అందం రేష్మా రాథోర్ మాత్రం 'గ్లామర్ అనేది క్షణికం, న్యాయం కోసం పోరాడటమే అసలైన జీవితం' అని నిరూపిస్తున్నారు రేష్మ. ఆమె యాక్టింగ్కి గుడ్ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కేందుకు రెడీ అయ్యింది.
ఈ రోజుల్లో మూవీతో హీరోయిన్గా పరిచయమైన రేష్మా రాథోర్
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. బాలనటిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె, వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో చదువుతుండగా దర్శకుడు మారుతి కంటపడ్డారు. ఆయన తీసిన యూత్ఫుల్ హిట్ 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మా హీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్బస్టర్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.

