- Home
- Business
- Gold Prices: వీకెండ్ లో బంగారం భారీ షాక్..రూ.15వేలు తగ్గిన వెండి, గ్రాము పసిడి ఎంత పెరిగిందంటే..
Gold Prices: వీకెండ్ లో బంగారం భారీ షాక్..రూ.15వేలు తగ్గిన వెండి, గ్రాము పసిడి ఎంత పెరిగిందంటే..
Gold Prices: నిన్న బంగారం కొందామనుకున్నవారికి ఈరోజు భారీ షాక్ తగిలింది. ఒక్కరోజులోనే గోల్డ్ రేట్లు మళ్లీ పైకి ఎగబాకాయి. వెండి ప్రస్తుతం స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులకు ఊరట దొరికింది.

నిన్న వేలల్లో తగ్గి ఇవాళ భారీ షాక్
మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నిన్న వేలల్లో తగ్గిన పసిడి...ఇవాళ షాకిచ్చింది. కాకపోతే మరీ ఎక్కువగా కాకుండా చిన్న మొత్తంలో పెరగడం ఊరట కలిగించింది. నిన్న కొనుగోలుదారుల్లో ఆశలు రేకెత్తించినప్పటికీ, వారాంతంలో పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెట్టుబడిదారుల ఆసక్తి, డాలర్ మార్పుల కారణంగా బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి.
రూ.1,46,080కు చేరిన బంగారం
హైదరాబాద్ లో ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు గత రోజు ధరతో పోలిస్తే రూ.220 పెరిగి రూ.1,46,080కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారంపై డిమాండ్ కారణంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,33,900 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం రూ.1,09,560గా ఉంది.
రూ.15వేలు తగ్గిన వెండి
ఇక వెండి విషయానికి వస్తే, ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కాకపోతే గత కొన్ని రోజులను గమనిస్తే రూ.2.70లక్షల నుంచి రూ.2.55లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు రూ.15 వేలు తగ్గినట్లు. కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలు పెరిగినా, వెండి ధరల్లో స్థిరత్వం ఉండటం కొనుగోలుదారులకు కొంత ఊరట ఇచ్చిందనే చెప్పుకోవాలి.
బంగారం ధరల్లో యూటర్న్
గత రోజు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరగడంతో పసిడి ప్రియులు తాజా రేట్లపై దృష్టిపెట్టారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, డాలర్ మార్పులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాలు బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

