మనలో చాలా మందికి ప్రతిరోజూ అన్నం తినే అలవాటు ఉంటుంది. కొందరికి చపాతీలు తినే అలవాటు ఉండొచ్చు.అయితే.. బరువు తగ్గాలంటే వీటిని మానేయాల్సిన అవసరం మాత్రం లేదు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోవాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అన్నం , చపాతీ తినడం మానేయాలని ఫిక్స్ అవుతారు. రోజూ తినే అన్నం ప్లేస్ లోకి పచ్చి కూరగాయలు, సలాడ్స్ లాంటివి వచ్చి చేరతాయి. కానీ, ఇవి తిన్నప్పుడు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందవు. దీంతో, నీరసం అయిపోతారు. రెండు రోజులు ఇలా చేసి, తట్టుకోలేక మళ్లీ జంగ్ ఫుడ్ తింటారు. దీంతో మరింత బరువు పెరుగుతారు. బరువు తగ్గాలంటే కచ్చితంగా అన్నం తినడం మానేయాలా? అసలు నిపుణులు ఏమంటున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం...

మనలో చాలా మందికి ప్రతిరోజూ అన్నం తినే అలవాటు ఉంటుంది. కొందరికి చపాతీలు తినే అలవాటు ఉండొచ్చు.అయితే.. బరువు తగ్గాలంటే వీటిని మానేయాల్సిన అవసరం మాత్రం లేదు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే.. మనం రోజూ తీసకునే చపాతీల సంఖ్య, అన్నం పరిమాణం తగ్గించాలి.అప్పుడు శరీరానికి కావాల్సిన శక్తి అందడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వ్యక్తి చపాతీ , బియ్యం తక్కువగా తీసుకోవాలి. గోధుమ పిండి చపాతీ తయారుచేసేటప్పుడు, ఎక్కువ రాగి పిండిని జోడించండి. దానికి మెంతులు కలుపుకోవడం కూడా మీ ఆరోగ్యానికి సహాయపడుతుంది. రాగి పిండి థైరాయిడ్ ఉన్నవారు తినకూడదు. కాబట్టి.. అలాంటి వారు.. శెనగపిండిని వాడుకోవచ్చు. నార్మల్ గోధుమ పిండికి బదులు ఇలా శెనగపిండితో చేసిన రోటీలు తినడం వల్ల ప్రోటీన్ అందడంతో పాటు.. బరువు కూడా ఆరోగ్యంగా తగ్గవచ్చు.అంతేకాదు.. శనగ పిండిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది అధిక బరువు ఉన్నవారికి కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని కూడా నిర్వహించగలదు.

అన్నం కానీ చపాతీలు కానీ తక్కువ పరిమాణంలో తీసుకొని.. వాటితో పాటు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. కనీసం రెండు మూడు కూరలైనా తినాలి. పెరుగు బదులు మజ్జిగ తాగాలి. అన్నం, చపాతీతో మనకు కార్బో హైడ్రేట్స్ అందితే.. కూరలు, పప్పుతో మనకు ప్రోటీన్, ఫైబర్ లభిస్తుంది. ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరంగా కూడా ఉండొచ్చు.

చపాతీలో బియ్యం కంటే ఎక్కువ ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటాయి. చపాతీ తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండి ఉంటుంది. అదే సమయంలో, బియ్యం పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. తిన్న కొన్ని గంటల్లోనే మీకు ఆకలి వేస్తుంది.తెల్ల బియ్యంలో అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. దీని కారణంగా, శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి, రాత్రి బియ్యం తినకండి. ఇది బరువు తగ్గడం సవాలుగా మారుతుంది. జీర్ణక్రియకు కూడా కారణమవుతుంది.

అంతేకాదు, మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటే, సూప్ తాగండి, సలాడ్ తినండి. రాత్రి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినండి. రాత్రి చపాతీలు, అన్నం తినకండి. వీలైనంత వరకు తొందరగా రాత్రి భోజనం పూర్తి చేయాలి. రాత్రి 7 తర్వాత ఏమీ తినకుండా ఉంటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు.