టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన ఛార్మీ విచారణ... రెండు బ్యాంక్ ఖాతాలపై ఈడీ ఫోకస్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మీ విచారణ పూర్తయ్యింది. విచారణలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అకౌంట్ల వివరాలు ఇచ్చానని ఛార్మీ చెప్పారు. కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఆమె ఈడీ అధికారులకు తెలిపారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రెండో రోజు విచారణలో భాగంగా సినీ నటి ఛార్మీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు కీలక డాక్యుమెంట్లు అందజేసినట్లు ఛార్మీ చెప్పారు. విచారణలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అకౌంట్ల వివరాలు ఇచ్చానని ఛార్మీ చెప్పారు.
ALso Read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం
కాగా విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పరిశీలించారు ఈడీ అధికారులు. 2016లో కెల్విన్తో మాట్లాడిన కాల్ డేటా.. వాట్సాప్ ఛాట్ను ఛార్మీకి చూపిన అధికారులు దాదా పేరుతో ట్రాన్స్ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఛార్మీ ఈడీ అధికారులకు చెప్పారు. కెల్విన్తో పాటు మరో ముగ్గురి ఫోటోలను ఛార్మీకి చూపిన అధికారులు వారితో జరిగిన లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు.