కన్నడ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు సీఎఫ్ఎస్ఎల్ వెల్లడి
శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ ల్యాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్) కీలక విషయాలను వెల్లడిచింది. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించింది. గతంలో వీరి నుంచి తీసుకున్న నమూనాలకు సంబంధించిన రిపోర్ట్ ని తాజాగా బయటపెట్టారు.
కన్నడ నటీమణులు సంజన గల్రానీ, రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో ఇరుక్కపోయారు. గతేడాది వీరిపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన విషయంలో తెలిసిందే. ఇందులో భాగంగా వీరు జైలు జీవితం కూడా అనుభవించి బెయిల్ పై వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ ల్యాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్) కీలక విషయాలను వెల్లడిచింది. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించింది. గతంలో వీరి నుంచి తీసుకున్న నమూనాలకు సంబంధించిన రిపోర్ట్ ని తాజాగా బయటపెట్టారు.
మొదట రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలు చేయగ నిర్ధారణ కాకపోవడంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) వెంట్రుకల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో నాయికలిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెయిల్ మీద బయటున్న తారలిద్దరికీ మరోసారి సమన్లు అందనున్నాయి. సంజనా, రాగిణి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందేనని కన్నడ వర్గాల చెబుతున్నాయి. మరోసారి జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. ఈ కేసులో రాగిని, సంజనతోపాటు విరెన్ ఖన్నా, ఆదిత్య అల్వా ల పేర్లు కూడా ఉన్నాయి. వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్టు తాజాగా సీఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది.