Asianet News TeluguAsianet News Telugu

వెంకీ 75వ సినిమాపై నిర్మాత క్లారిటీ.. అంతా తూచ్‌

 హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ సహ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉంటుందని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. 

producer nagavamshi gave clarity on venkatesh 75th film under the direction of trivikram
Author
Hyderabad, First Published Sep 7, 2020, 7:31 AM IST

విక్టరీ వెంకటేష్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని మూడేళ్ళ క్రితం అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. సోషల్‌ మీడియాలో గత కొన్ని వారాలుగా ఈ వార్త హల్‌చల్‌ చేస్తుంది. 

తాజాగా దీనిపై నిర్మాతలు స్పందించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ సహ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉంటుందని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ ఫేక్‌ న్యూస్‌ అని తెలిపింది. 

ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేస్తూ, `వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా విషయంలో మీ ఎగ్జైట్‌మెంట్‌ని మేం అర్థం చేసుకున్నాం. కానీ వెంకీ75వ సినిమాకి సంబంధించి వస్తోన్న వార్తలు ఫేక్‌. మా నెక్ట్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్‌డేట్‌ మేం అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటి వరకు వేచి ఉండండి` అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం వెంకీ తన 74వ చిత్రంగా `నారప్ప`లో నటిస్తున్నారు. ఇది తమిళ చిత్రం `అసురన్‌`కి రీమేక్‌. శ్రీకాంత్‌ అడ్డాల దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో ప్రియమణి కథానాయికగా నటిస్తుంది. సురేష్‌ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు దీన్ని నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios