'యాత్ర'కి షాక్.. విడుదల ఆపాలి!
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో రూపొందుతోన్న 'యాత్ర' సినిమాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా విడుదల ఆపాలంటూ పిటిషనర్ కోర్టుని కోరారు.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో రూపొందుతోన్న 'యాత్ర' సినిమాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా విడుదల ఆపాలంటూ పిటిషనర్ కోర్టుని కోరారు. కేసుని విచారించిన హైకోర్టు ఈ నెల 6కి విచారణ వాయిదా వేసింది.
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా మొత్తం వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరగనుందని దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమాలో ఎటువంటి కాంట్రవర్సీలు కూడా ఉండవని పరోక్షంగా చెప్పారు.
సినిమాలో వైఎస్ ప్రత్యర్ధుల పాత్రలు కూడా ఉండవని అన్నారు. సెన్సార్ బోర్డ్ కూడా ఎలాంటి కట్స్ చెప్పకుండా సినిమాను సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఫిబ్రవరి 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూనిట్ ప్రకటించింది.
కానీ ఊహించని విధంగా ఇప్పుడు సినిమాపై కేసు పెట్టారు. మరి ఈ సినిమా విడుదలపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
‘యాత్ర’: చంద్రబాబు, జగన్ పాత్రల గురించి దర్శకుడు ఇలా
‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఆ హీరో చీఫ్ గెస్ట్ గా?
ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?
వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?
వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!
'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!