Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

ఏపీలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ లను తెరకెక్కించారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'కథానాయకుడు' విడుదల కాగా, ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

No buzz for ysr biopic yatra
Author
Hyderabad, First Published Jan 20, 2019, 3:49 PM IST

ఏపీలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ లను తెరకెక్కించారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'కథానాయకుడు' విడుదల కాగా, ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకి పోటీగా వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర'ని రంగంలోకి దించాలని ప్లాన్ చేశారు. మొదటినుండి కూడా యాత్ర సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా వచ్చేలా పావులు కదిపారు. ఆ విధంగా యాత్రపై బజ్ క్రియేట్ అవుతుందని భావించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ సినిమాల మధ్య మంచి పోటీ ఉంటుందని ఊహించారు.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమాని వాయిదా వేయడంతో ఫిబ్రవరి 8న యాత్రం ఒంటరిగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేకపోయింది చిత్రబృందం. టీజర్, ట్రైలర్ లకు పెద్దగా క్రేజ్ రాలేదు.

సినిమా పోస్టర్లు కూడా రొటీన్ గానే ఉండడంతో ఈ సినిమాపై ఎవరి దృష్టి పడడం లేదు. ఒక మీడియా సంస్థ స్పెషల్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందనుకుంటే అది కూడా లేదు. దీంతో ఈ సినిమాను పట్టించుకునేవారే లేకుండా పోయింది. మరి సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి! 

Follow Us:
Download App:
  • android
  • ios