- Home
- Entertainment
- Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Mahesh Babu Troll: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం మొదలైంది! సొంత అన్న కొడుకు సినిమా విషయంలో ఆయన పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటి?

మహేష్ బాబుపై ట్రోలింగ్...
ఫిల్మ్ ఇండస్ట్రీలో 'సూపర్ స్టార్' అనిపించుకోవడం ఎంత కష్టమో, ఆ స్టార్డమ్ను నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చుట్టూ ఇలాంటి హాట్ టాపిక్కే నడుస్తోంది. దీనికి కారణం, ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో, జయకృష్ణ ఘట్టమనేని నటించిన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం' విడుదల కావడమే.దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని మొదటి సినిమా 'శ్రీనివాస మంగాపురం' ఈవెంట్కు మహేష్ బాబు హాజరుకాకపోవడం పెద్ద వివాదంగా మారింది. కేవలం ఒక ట్వీట్తో సరిపెట్టడంపై నెటిజన్లు, అభిమానులు విమర్శలు చేస్తున్నారు.
అన్న కొడుక్కి ఇచ్చేది ఒక ట్వీట్ మాత్రమేనా?
దివంగత రమేష్ బాబు కొడుకైన జయకృష్ణ, హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన బాబాయ్ మహేష్ బాబు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు వచ్చి ఆశీర్వదిస్తాడని, సినిమాకు పెద్ద మైలేజ్ వస్తుందని అందరూ ఆశించారు. కానీ మహేష్ బాబు మాత్రం కేవలం ఒక చిన్న వీడియో, రెండు ట్వీట్లతో తన సపోర్ట్ ను పరిమితం చేసేశారు. ఈవెంట్కు ఆయన రాకపోవడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
చిరంజీవితో పోల్చుతూ మహేష్పై ఫైర్!
టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు తమకంటే చిన్న హీరోల సినిమాల ఈవెంట్స్ కు వెళ్లి సపోర్ట్ చేస్తుంటారు. చిరంజీవి, అల్లు అర్జున్, చరణ్, అంతెందుకు మహేష్ బాబు కూడా కొంత మంది హీరోల ఈవెంట్స్ కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.మెగాస్టార్ చిరంజీవిని ఉదాహరణగా చూపిస్తు కొంత మంది మహేష్ ను విమర్శిస్తున్నారు. చిరంజీవి తన కుటుంబ సభ్యులనే కాకుండా, కిరణ్ అబ్బవరం లాంటి చిన్న, బయటి హీరోల సినిమాలకు కూడా అండగా నిలుస్తారని, కానీ మహేష్ బాబు మాత్రం తన లోకంలో తాను బిజీగా ఉంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
మహేష్ బాబు రాకపోవడానికి కారణం అదేనా?
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న 'వారణాసి' (SSMB29) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం తన కొత్త లుక్ బయటకు రాకూడదనే కారణంతోనే ఆయన ఈవెంట్కు రాలేదని కొందరు చెబుతున్నారు. కానీ, ఇటీవలే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్లతో కలిసి మహేష్ ఏఎంబీ సినిమాస్లో కనిపించారు. "ఫారెన్ స్టార్స్తో ఫోటోలు దిగడానికి అడ్డురాని లుక్, అన్న కొడుకు ఫంక్షన్కు రావడానికి అడ్డొచ్చిందా?" అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీనివాస మంగాపురం వివరాలు..
`శ్రీనివాస మంగాపురం` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు జయకృష్ణ. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా పరిచయం అయ్యింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్ సి అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్పీ పతాకంపై జెమినీ(పి) కిరణ్ నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు.

