Asianet News TeluguAsianet News Telugu

వివాదంలో `మహానటి` డెబ్యూ మూవీ

మిస్ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి, రంగ్‌ దే, అన్నాతే, మరక్కార్ లాంటి సినిమాలతో బిజీగా ఉంది. అయితే కీర్తి తొలి సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీ నేను శైలజ కన్నా ముందే ఓ తెలుగు సినిమా చేసింది. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్‌ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Keerthy Suresh Debut Movie in Controversy
Author
Hyderabad, First Published Sep 15, 2020, 8:05 PM IST

అందాల భామ కీర్తి సురేష్ తొలి సినిమా ఏంటి అంటే అంతా నేను శైలజ అని టక్కున చెప్పేస్తారు. రామ్‌ హీరోగా తెరకెక్కిన నేనూ శైలజతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కీర్తి తరువాత స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. మహానటి సినిమాతో తెలుగుతో పాటు జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతులో చాలా సినిమాలే ఉన్నాయి.

మిస్ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి, రంగ్‌ దే, అన్నాతే, మరక్కార్ లాంటి సినిమాలతో బిజీగా ఉంది. అయితే కీర్తి తొలి సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీ నేను శైలజ కన్నా ముందే ఓ తెలుగు సినిమా చేసింది. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్‌ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావటంతో నేను శైలజతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను చంటి అడ్డాల నిర్మించాను. అయితే ఇన్నేళ్లుగా వాయిదా పడుతున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. జానకి నేను అనే టైటిల్‌తో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ విషయంలోనే వివాదం జరుగుతోంది.

ఈ సినిమా రిలీజ్ హక్కులను ముందుగా నట్టి కుమార్‌కు అమ్మాడట నిర్మాత నట్టి కుమార్. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తన దగ్గర ఉన్నాయనని చెబుతున్నాడు నట్టి కుమార్. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడేలా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.

Follow Us:
Download App:
  • android
  • ios