Asianet News TeluguAsianet News Telugu

`మా` ప్రతిష్టని దెబ్బతీసే ఏ ఒక్కరిని ఊపేక్షించరాదుః చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు.. కృష్ణంరాజుకి లేఖ

`మా` ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఎన్నికలు పెద్ద చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్‌ స్పందించారు. కృష్ణంరాజుకి లేఖ రాశారు. ఇందులో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

chiranjeevi letter to krishnam raju on maa election and strong warning members
Author
Hyderabad, First Published Aug 9, 2021, 7:10 PM IST

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఇటీవల `మా` ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం బాడీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ,జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు సైతం తమ ప్రకటనలు, వ్యాఖ్యలతో హాట్‌ టాపిక్‌గా మారింది. `మా` ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఎన్నికలు పెద్ద చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్‌ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

చిరంజీవి `మా` క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకి ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. `మా` అధ్యక్ష ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపినట్టు తెలుస్తుంది. అదే సమయంలో సభ్యుల బహిరంగ ప్రకటనలతో `మా` ప్రతిష్ట మసకబారుతుందని ఆయన ఆవేదన చెందారు. `మా` ప్రతిష్టని దెబ్బతీసే ఏ ఒక్కరిని ఊపేక్షించవద్దు అని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజుని చిరంజీవి కోరినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఇప్పటికే `మా` ప్రస్తుత కమిటీ కాలపరిమితి మార్చితోనే పూర్తయ్యింది.కరోనా వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. అయితే `మా` అధ్యక్ష బరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios