Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో మొట్టమొదటి ఎలక్ట్రికల్ చార్జింగ్ బంక్ ప్రారంభం

ప్రస్తుతం పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అంతే కాకుండా ఈ కాలుష్య ఉద్గారాల వల్ల పర్యావరణానికి కూడా హాని కల్గుతోంది. ఈ రెండింటికి ఒకేసారి పరిష్కారం చూపెట్టడానికి మార్కెట్లోకి వస్తున్నవే ఎలక్టిక్ వాహనాలు. వీటివల్ల అటు వినియోగదారుడిపై భారం తగ్గడంతో పాటు పర్యావరణానికి నష్టం జరగదు. దీంతో మార్కెట్లో ఇప్పుడు వీటికి మంచి గిరాకీ పెరుగుతోంది.

charging stations for electric vehicles in hyderabad city

ప్రస్తుతం పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అంతే కాకుండా ఈ కాలుష్య ఉద్గారాల వల్ల పర్యావరణానికి కూడా హాని కల్గుతోంది. ఈ రెండింటికి ఒకేసారి పరిష్కారం చూపెట్టడానికి మార్కెట్లోకి వస్తున్నవే ఎలక్టిక్ వాహనాలు. వీటివల్ల అటు వినియోగదారుడిపై భారం తగ్గడంతో పాటు పర్యావరణానికి నష్టం జరగదు. దీంతో మార్కెట్లో ఇప్పుడు వీటికి మంచి గిరాకీ పెరుగుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఓ ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటయింది.  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌  లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)సంస్థ రాయదుర్గంలో మిస్సెస్‌ దినేష్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ పేరుతో ఓ రిచార్జ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించి కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించడంలో తమ వంతు పాత్రగా ఈ ఎలక్ట్రికల్ రీచార్జ్ బంకు ను ఏర్పాటు చేసినట్లు హెచ్‌సిఎల్ సంస్థ తెలిపింది.   వీటిని త్వరలో తెలంగాణ వ్యాప్తంగా వున్న అన్ని నగరాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. 

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. అందుకోసం ఈ ఎలక్ట్రిక్ చార్జింగ్ బంకుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక మినహాయింపులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగంలో మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించి అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగేలా చూస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.


  

Follow Us:
Download App:
  • android
  • ios