ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జగన్
విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరగడంతో హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్లో చికిత్స తీసుకుంటున్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరగడంతో హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్లో చికిత్స తీసుకుంటున్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దాడి ఘటనపై ఏపీ పోలీసులు జగన్ని కలిసిన తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తమ అభిమాన నేత క్షేమంగా బయటకు రావడంతో న్యూరో సెంటర్ వద్ద ఉన్న వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకనేతలు, కుటుంబసభ్యులు ఉన్నారు. ఆస్పత్రి నుంచి ఆయన నేరుగా లోటస్పాండ్లోని తన నివాసానికి వెళతారు.
జగన్ కి చిన్నముల్లు కూడా గుచ్చుకోకుండా చూసుకున్నాం.. సోమిరెడ్డి
రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం
జగన్ పై దాడి... రంగంలోకి కేంద్ర దర్యాప్తు బృందం
జగన్పై దాడి: హైకోర్టుకెక్కిన వైసీపీ
జగన్పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి
ఎపి పోలీసులపై నాకు నమ్మకం లేదు: జగన్
'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'
జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?
జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు