జగన్ పై దాడి... రంగంలోకి కేంద్ర దర్యాప్తు బృందం
అక్కడ శ్రీనివాసరావు ఇంటికి చేరుకొని .. అతని కుటుంబసభ్యులను అధికారులు విచారిస్తున్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిలో నిజా నిజాలు వెలుగు తీసేందుకు కేంద్ర దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ స్వగ్రామానికి కేంద్ర దర్యాప్తు బృందం చేరుకుంది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం ఠానేలంక గ్రామానికి ఈ రోజు ఉదయం కేంద్ర దర్యాప్తు బృందం చేరుకుంది. అక్కడ శ్రీనివాసరావు ఇంటికి చేరుకొని .. అతని కుటుంబసభ్యులను అధికారులు విచారిస్తున్నారు.
గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు దాడి చేసిన సంగతి తెలిసిందే.ఎయిర్ పోర్టు లాంజ్ లో కూర్చొని ఉండగా.. పందెం కోళ్లకు కట్టే కత్తితో ఎడమచేతి భుజంపై దాడి చేశాడు. ప్రస్తుతం జగన్ హైదరాబాద్ లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇస్తున్నట్లు సమాచారం.
read more news
డైరెక్ట్గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్పై చంద్రబాబు ఆగ్రహం
జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు
జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?
జగన్ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?
జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు
ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ
ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ
జగన్పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్తో మెమో