Asianet News TeluguAsianet News Telugu

శాసనమండలిలో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం, గ్యాలరీలో బాబు

శాసనమండలిలో బుధవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

war words between tdp, ysrcp: Tension prevails in Ap legislative council
Author
Amaravathi, First Published Jan 22, 2020, 6:04 PM IST

అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని శాసనమండలి ఛైర్మెన్ పోడియం వద్ద బుధవారం నాడు సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది.

also read:శాసనమండలిలో ముగిసిన చర్చ: సెలెక్ట్ కమిటీకి టీడీపీ పట్టు, వద్దన్న వైసీపీ

సెలెక్ట్ కమిటీకి ఈ రెండు బిల్లులను పంపాలని  డిమాండ్ చేస్తూ  టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఛైర్మెన్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.  

also read: ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్

Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

మంత్రి కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్సీల వైపు దూసుకు వచ్చారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు కూడ మంత్రి వైపుకు దూసుకువచ్చారు. మంత్రులు రంగనాథ రాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మంత్రిని వారించారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ టీడీపీ ఎమ్మెల్సీలను వెనక్కి పంపారు.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

ఇదే సమయంలో  టీడీపీ  చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో కలిసి మండలి గ్యాలరీకి చేరుకొన్నారు. ఈ విషయమై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  మండలి ఛైర్మెన్ షరీఫ్‌కు చంద్రబాబు గ్యాలరీకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో మండలిని 10 నిమిషాల పాటు మండలి ఛైర్మెన్ షరీఫ్ వాయిదా వేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios