Asianet News TeluguAsianet News Telugu

శాసనమండలిలో ముగిసిన చర్చ: సెలెక్ట్ కమిటీకి టీడీపీ పట్టు, వద్దన్న వైసీపీ

ఏపీ శాసనమండలిలో  పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులపై చర్చ పూర్తైన తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపాలని  టీడీపీ డిమాండ్ చేసింది. 

Three capital row: TDP demands Select Committee referral while YSRCP opposes
Author
Amaravathi, First Published Jan 22, 2020, 5:51 PM IST

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు,  సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై బుధవారం నాడు సాయంత్రం చర్చ ముగిసింది.  అయితే ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

also read: ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్

Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

బుధవారం నాడు ఉదయం నుండి పాలనా వికేంద్రీకరణ బిల్లు,  సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ ప్రారంభమైంది. పడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు  ప్రారంభించారు.  ఆ తర్వాత పలు పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. బుధవారం నాడు సాయంత్రానికి ఈ విషయమై చర్చలు పూర్తయ్యాయి.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

చర్చ ముగిసిన తర్వాత ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని  టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు కోరారు. అయితే  సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

ఈ విషయమై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలా వద్దా అనే విషయమై ఓటింగ్ నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కోరారు.

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

ఈ రెండు బిల్లులపై సవరణలు కోరుతూ తనకు టీడీపీ సభ్యులు నోటీసులు ఇచ్చారని శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ సభలో ప్రకటించారు. దీంతో శాసనమండలి ఛైర్మెన్ షరీప్ తీరుపై అధికార పార్టీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios