
Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్
గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరుమలకు విచ్చేసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్వాగతం పలికారు. వేద మంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా స్వాగతం అందించిన అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు మరియు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వరాహస్వామి వారిని కూడా దర్శించుకున్నారు.