Asianet News TeluguAsianet News Telugu

హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు... ఒక్క రాత్రికి ఎంతంటే..

 విమానాశ్రయం నుంచి నేరుగా కారులో అల్లిపురంలోని విశాఖ ఇన్‌ హోటల్‌కు చేరుకుని అప్పటికే వారి పేరిట బుక్‌ చేసి వున్న గదుల్లో దిగారు. హోటల్‌లోని వారి గదుల్లోకి కొంతమంది విటులు వెళ్లి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈనెల 22న టూటౌన్‌ సీఐ సీహెచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హోటల్‌పై దాడి చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. విటులు మాత్రం తప్పించుకున్నారు.
 

Prostitution Goes Hi-Tech In Vizag With Smartphones, Messaging app's
Author
Hyderabad, First Published Aug 26, 2019, 11:50 AM IST

హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముంబయి, బెంగళూరు నుంచి యువతులను విశాఖ నగరానికి రప్పించి...అక్కడ హోటల్స్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించగా గట్టు రట్టయ్యింది. యువతులు పోలీసులకు పట్టుబడగా...విటులు మాత్రం పరారయ్యారు. విశాఖ నగరంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబైకి చెందిన యువతి హైదరాబాద్‌ నుంచి ఈనెల 20న, బెంగళూరుకి చెందిన యువతి కోల్‌కతా నుంచి ఈనెల 22న విమానంలో నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా కారులో అల్లిపురంలోని విశాఖ ఇన్‌ హోటల్‌కు చేరుకుని అప్పటికే వారి పేరిట బుక్‌ చేసి వున్న గదుల్లో దిగారు. హోటల్‌లోని వారి గదుల్లోకి కొంతమంది విటులు వెళ్లి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈనెల 22న టూటౌన్‌ సీఐ సీహెచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హోటల్‌పై దాడి చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. విటులు మాత్రం తప్పించుకున్నారు.

కాగా.. వీరు లావాదేవులు మొత్తం ఫోన్లలోనే నడిపేవారని తెలుసుకొని పోలీసులు షాకయ్యారు.  తమకు రిషి అనే వ్యక్తి మాత్రమే తెలుసునని, ఆయన చెప్పినట్టు తాము చేస్తామని తెలిపారు. తాము ఎక్కడికి వెళ్లాలనేది ఫోన్‌లోనే చెబుతాడని, తమకు విమానం టిక్కెట్లు కూడా అతనే బుక్‌ చేసి మెయిల్‌ చేసేస్తాడని వివరించారు.

 ఏ నగరానికి వెళ్లినా అక్కడ హోటల్‌ రూమ్‌ నుంచి కారు వరకూ అన్నీ బుక్‌ చేసి తమ ఫోన్‌కు వాటి వివరాలు మెసేజ్‌ చేస్తాడని తెలిపారు. ఏ నగరానికి వెళ్లినా రెండు రోజులు మాత్రమే వుంటామని, తర్వాత రూమ్‌ ఖాళీ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుంటామని వివరించారు. ఒక్కో విటుడికి రూ.1,500 చొప్పున తమ ఖాతాకు జమ చేస్తాడని పట్టుబడిన యువతులు వివరించారు. 

విటులు కూడా నేరుగా రిషినే సంప్రతిస్తారని, వారి పేరును మాత్రం తమకు ఫోన్‌ చేసి చెబుతాడని చెప్పడం గమనార్హం. పట్టుబడిన యువతులను శనివారం పునరావాస కేంద్రానికి తరలించామని పోలీసులు చెప్పారు.  కేసుకి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios