Asianet News TeluguAsianet News Telugu
Mydukur Assembly elections result 2024 ksp

మైదుకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

మైదుకూరు పేరు చెప్పగానే డీఎల్ రవీంద్రా రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్‌లు గుర్తొస్తారు. 1983 నుంచి రవీంద్రారెడ్డి, రఘురామిరెడ్డిలు తలపడుతూ వస్తున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2,07,957 మంది ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్‌లో దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలున్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో తెరపైకి వచ్చారు. 2014, 2019లలో ఆయన టీడీపీ తరపున.. రఘురామిరెడ్డితో తలపడ్డారు. రెండు సార్లూ హోరాహోరీ పోరు నడిచినప్పటికీ శెట్టిపల్లే విజయం సాధించారు. మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది సుధాకర్ యాదవ్ కల.  జగన్‌పై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి, వరుసగా రెండు సార్లు ఓడిన సానుభూతి తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.