Ration distribution: ఇకపై నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు పూటలుగా రేషన్ డీలర్ల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని ఆంధప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
తిరుమల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన టీటీడీ.. జూన్లో గోవిందరాజస్వామి, కోదండరామ స్వామి, కడప లక్ష్మీవేంకటేశ్వరాలయాల్లో విశేష ఉత్సవాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూస్తున్న కరోనా కేసులు ప్రజలను కంగారుపెడుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్ ఉద్యోగులు, విజయవాడ హాస్సిటల్ వైద్యురాలికి కరోనా సోకింది.
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ విడుదల అయ్యింది. జూన్ 6 నుంచి 30 వరకు జరుగనున్నాయి. మొత్తం 3.35 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన వృద్ధి గురించి,కృషి ,మోడీ నాయకత్వంలోని అభివృద్దిని వివరించడంతో పాటు...2047 నాటికి వికసిత భారత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం 10 వేల డీజి లక్ష్మి కియోస్క్లు ఏర్పాటు కానున్నాయి. డ్వాక్రా మహిళల నిర్వహించబోయే ఈ కేంద్రాల్లో 20 రకాల డిజిటల్ సేవలు లభించనున్నాయి.
చంద్రబాబు తనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్ అని, తన పాలనకు స్పష్టమైన ఫలితాలు ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యం, పర్యాటకం, వ్యవసాయం రంగాల్లో ప్రణాళికలపై వివరించారు.
కడప మహానాడు సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో మహానాడు నిర్వహణకు సహకరించిన టిడిపి నాయకులకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ఏపీలోని ప్రతి కుటుంబానికి రేషన్ బదులు ప్రతి నెలా..అకౌంట్లో 2 వేల రూపాయలు వేయాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రభుత్వానికి కీలక సూచన చేశారు.దీని వల్ల పేదవారు నిత్యావసరాలు కొనుక్కుంటారని ఆయన అన్నారు.
మరో పదిరోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక రకాల పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.