
పింఛన్ ఇవ్వడానికి వెళ్లిన సీఎం.. దీనస్థితి చూసి ఎమోషనల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో లబ్ధిదారు బాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛను అందించారు. ఆమె కుమారుడు బాలరాజు అనారోగ్యంపై స్పందించిన సీఎం, ప్రభుత్వం తరఫున పూర్తి వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.