అధికారిక లాంఛనాలతో శివప్రసాద్ అంత్యక్రియలు
ఆదివారం శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివప్రసాద్ మా అందరికీ అన్నలాంటి వారని ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఆదివారం శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివప్రసాద్ మా అందరికీ అన్నలాంటి వారని ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.
శివప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. చిత్తూరు జిల్లా ఐతేపల్లి సమీపంలోని అరగాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ప్రజలు, కార్యకర్తల సందర్శనార్ధం ఆయన పార్థీవ దేహాన్ని తిరుపతిలోని శివప్రసాద్ నివాసంలో ఉంచారు. సాయంత్రం 4 గంటలకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
శివప్రసాద్ అంతిమయాత్రలో ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
సాయంత్రం 5 గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు: పాల్గొననున్న చంద్రబాబు
వైఎస్ రాజారెడ్డితో శివప్రసాద్కు సంబంధాలు: వైఎస్ఆర్ బంపర్ ఆఫర్
మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం కలచివేసింది : పవన్ కళ్యాణ్
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ నేపథ్యమిదీ
ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే
మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం
ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన
హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ
చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!