తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ఇండియా పాకిస్థాన్ యుద్దవాతావరణం, ఆపరేషన్ సిందూర్ వార్తలతో పాటు లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:29 AM (IST) May 11
India Pakistan Tensions: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరణించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ డ్రోన్లను భారత గగనతలంలోకి పంపడం ద్వారా దాన్ని ఉల్లంఘించింది, దీంతో అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.
పూర్తి కథనం చదవండి11:23 PM (IST) May 10
Pakistan violates ceasefire: కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మరోసారి దాడులకు పాల్పడటంతో పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి10:18 PM (IST) May 10
India-Pakistan Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బోలెడు అబ్దాలు చెప్పింది. అయితే, ఇండియన్ ఆర్మీ అన్నిటినీ నిజాలతో బట్టబయలు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:28 PM (IST) May 10
India Pakistan: పాకిస్తాన్ మరోసారి తన కుటిల బుద్దిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకే చెప్పిన కొన్ని గంటల్లోనే భారత్ పైకి డ్రోన్లతో దాడులకు దిగింది. శ్రీనగర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
08:45 PM (IST) May 10
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ ముందు తలొగ్గింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి, యుద్ధం ఆగిపోయింది. ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థలు దీనిపై ఎలా స్పందించాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
08:38 PM (IST) May 10
మే 14, 2025న సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సంతోషం, ధనలాభం కలుగుతుంది. ఆ నాలుగు రాశులు ఏంటి.? వారీ జీవితంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
08:34 PM (IST) May 10
India Pakistan Ceasefire: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపు ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్టే. అసలు ఏంటి ఈ కాల్పుల విరమణ? ఇప్పుడు ఏం జరుగుతుంది? గత చరిత్ర, ఉల్లంఘనలు సహా ఆసక్తికర విషయాలు మీకోసం.
08:21 PM (IST) May 10
బాలీవుడ్లో చాలా మంది నటీమణులు సింగిల్ మదర్స్గా పిల్లల్ని పెంచుతున్నారు. మేకప్ లేకుండా వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండి08:17 PM (IST) May 10
కారు కొనుగోలు చేయడం అనేది చాలా మందికి ఒక కల లాంటిది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గానికి చెందిన వారు మాత్రమే కారు గురించి ఆలోచించే వారు. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలు కూడా కారును కొనుగోలు చేస్తున్నారు. నెలకు కేవలం రూ. 6 వేలు ఈఎమ్ఐ చెల్లించి కొత్త కారును సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఒక బెస్ట్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
07:49 PM (IST) May 10
Indian Soldier Returns to Border Days After Wedding: మహారాష్ట్ర పాచోరాకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ పెళ్లైన మూడు రోజులకే దేశ రక్షణ కోసం బోర్డర్కు తిరిగి వెళ్లారు. భార్య యామిని కన్నీటి పర్యంతమవుతూ 'దేశ రక్షణ కోసం తన సింధూరాన్ని పంపుతున్నానంటూ' ఎమోషనల్ అయ్యారు.
07:00 PM (IST) May 10
జమ్మూకశ్మీర్లో ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న దాడి తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో రెండు దేశాలు పరస్పరం దాడులకు కూడా దిగాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు శనివారం (మే 10)తో తెరపడింది.
06:57 PM (IST) May 10
India Pakistan War: డీఆర్డీవో (DRDO) అభివృద్ధి చేసిన డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ పాకిస్తాన్ డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటూ భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియన్ డోమ్ టెక్నాలజీ భారత నగరాలను సురక్షితంగా ఉంచుతోంది. పాక్ దాడికి చెక్ పెడుతున్న డీఆర్డీవో టెక్నాలజీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
06:50 PM (IST) May 10
గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రికత్త వాతావరణానికి ఫుల్ స్టాప్ పడింది. భారత్, పాకిస్థాన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ అధికారులు ప్రకటించారు.
06:37 PM (IST) May 10
IPL 2025: ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్ లను మూడు వేదికల్లోనే నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది.
05:59 PM (IST) May 10
India Pakistan War : పోఖ్రాన్పై పాకిస్తాన్ డ్రోన్ దాడిని భారత వాయుసేన భగ్నం చేసింది. రాజస్థాన్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్తో పాటు రాత్రివేళ బ్లాక్ఔట్ అమలు చేస్తున్నారు.
05:51 PM (IST) May 10
భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ పరిస్థితులు చేజారిపోతూ వచ్చాయి. ఒకానొక సమయంలో పాకిస్థాన్ అణు దాడికి దిగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటంటే..
05:25 PM (IST) May 10
మేకప్ లేకుండా కనిపించిన కరిష్మా కపూర్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి05:16 PM (IST) May 10
జమ్మూలో పాక్ జరిపిన దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి, స్వగ్రామానికి పంపించారు.
పూర్తి కథనం చదవండి05:13 PM (IST) May 10
విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాల గురించి సమంత మాట్లాడింది.
పూర్తి కథనం చదవండి05:06 PM (IST) May 10
ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో, వైమానిక దళ జవాన్ మోహిత్ రాథోడ్ తన పెళ్లి మరుసటి రోజే విధి నిర్వహణకు బయలుదేరారు. జవాన్ చేసిన ఈ పనికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి04:47 PM (IST) May 10
పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయం చేస్తున్నట్టు భారత్ బయటపెట్టడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
పూర్తి కథనం చదవండి04:42 PM (IST) May 10
Share Market: ఐటీ ఉద్యోగి అయిన ఒక అమ్మాయి కేవలం రూ.500తో షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టి ఏకంగా రూ.2 కోట్లకు పైగా పోర్ట్ఫోలియోను సృష్టించింది. అంతేకాకుండా రిస్క్ తీసుకొని రూ.3 లక్షల రుణం తీసుకుని ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టడం ఆమెను గేమ్ ఛేంజర్ గా నిలబెట్టింది. ఆమె ఇప్పుడు ఇంట్రాడే, ఆప్షన్ ట్రేడింగ్లో దూసుకుపోతూ ప్రొఫెషనల్స్ నే ఆశ్చర్యపరుస్తోంది. ఈ సక్సస్ ఫుల్ మహిళ విజయం గురించి మరిన్ని వివరాలు ఇవిగో.
పూర్తి కథనం చదవండి04:39 PM (IST) May 10
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన 'డ్యూడ్' సినిమా 2025 దీపావళికి విడుదలవుతోంది. కీర్తిస్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
పూర్తి కథనం చదవండి04:26 PM (IST) May 10
నటుడు రవి మోహన్, అతని భార్య ఆర్తి మధ్య విడాకుల వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. వేర్వేరుగా జీవిస్తున్నారు. రవిమోహన్ తండ్రిగా తన బాధ్యతలని మర్చిపోతున్నాడు అంటూ ఆర్తి ఎమోషనల్ గా ఆరోపణలు చేసింది.
పూర్తి కథనం చదవండి04:24 PM (IST) May 10
1971 తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ల మధ్య ఈ స్థాయి ఉద్రిక్తతలు నెలకొనడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. భారత్ పీఓకేను తిరిగి తీసుకోవాలనే డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో ఇది ఎంత వరకు సాకారమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
03:56 PM (IST) May 10
Summer Tips: వేసవిలో కార్ను బయట పార్క్ చేసినప్పుడు ఇంటీరియర్ వేడిగా మారడం మామూలే. కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కారును వేడి నుంచి కాపాడవచ్చు. దీంతో వేసవిలో కూడా కార్ చల్లగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి03:30 PM (IST) May 10
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. భారత్పై దాడులు చేస్తూ కయ్యానికి కాలు దూస్తున్న పాక్కు సొంత దేశంలోనే గడ్డు పరిస్థితులు ఉన్నాయి. అసలు పాక్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంతకీ పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఆ గడ్డు పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
03:01 PM (IST) May 10
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చేపట్టిన దాడుల్లో చాలామంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే తాజాగా అందులో కొందరు కీలక ఉగ్రవాదుల పేర్లు బయటకు వచ్చాయి. వారు ఎవరో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:53 PM (IST) May 10
Mahindra Thar 2025: మహీంద్రా కంపెనీ యువత కోసం ప్రత్యేకంగా థార్ 2025 న్యూ మోడల్ ని సిద్ధం చేసింది. దీన్ని ప్రత్యేకంగా యువత కోసం డిజైన్ చేసినట్లు మహీంద్రా తెలిపింది. పాత థార్ కి 2025 మోడల్ కి ఉన్న తేడాలు, యూత్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:45 PM (IST) May 10
ATM: ప్రస్తుతం నకిలీ నోట్లు భారీగా పెరుగుతున్నాయి. అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం నకిలీ నోట్లను మార్కెట్లోకి పెద్ద ఎత్తున సర్క్యూలేట్ చేస్తున్నారు. ఒకవేళ మీ చేతిలోకి నకిలీ నోటు వస్తే ఏం చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
02:20 PM (IST) May 10
రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రంలో క్యామియో పాత్రలో నటించడానికి బాలకృష్ణ అడిగిన పారితోషికం ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది.
పూర్తి కథనం చదవండి02:13 PM (IST) May 10
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్థాన్ భారత్పై దాడులకు దిగుతోంది. అయితే పాక్ దాడులను ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పుకొడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేశారు.
02:09 PM (IST) May 10
ఇండియా, పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని పోలుస్తూ రిటైర్డ్ పాకిస్తానీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనికుల సంఖ్యలో వ్యత్యాసం, పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆయన హైలైట్ చేశారు... ఈ క్రమంలోనే భారత్ ముందు పాకిస్థాన్ నిలవలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
పూర్తి కథనం చదవండి01:55 PM (IST) May 10
భారతదేశం–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ, హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లా చింతపుర్ణి ఆలయం సమీపంలోని బెహద్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి పేలుడు శబ్దం సంభవించింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రదేశం చుట్టూ విద్యుత్ సరఫరా నిలిపివేయబడి ఉండగా ఈ శబ్దం వినిపించింది.
01:49 PM (IST) May 10
కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'నాగ్ జిల్లా' సినిమాలో విలన్ పాత్ర కోసం అనిల్ కపూర్ లేదా బాబీ డియోల్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అనిల్ కపూర్ గతంలో చాలా సినిమాల్లో విలన్గా నటించారు. ఆయన నటించిన 6 సినిమాల గురించి తెలుసుకుందాం...
పూర్తి కథనం చదవండి01:41 PM (IST) May 10
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో అణుయుద్ధం గురించి చర్చ జోరందుకుంది. S-400 నుండి బ్రహ్మోస్, అగ్ని వంటి అత్యాధునిక ఆయుధాలతో శత్రుదేశాలను భారత్ నిలువరించగలదు.
పూర్తి కథనం చదవండి01:40 PM (IST) May 10
యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5 లక్షల రుణం అందిస్తోంది. ఈ లోన్ పొందినవాళ్లు పైసా కూడా వడ్డీ కట్టక్కర్లేదు. ఎటువంటి ష్యూరిటీ కూడా పెట్టాల్సిన పని లేదు. ఈ లోన్ పొందడానికి ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
01:34 PM (IST) May 10
పాకిస్తాన్ కు IMF లోన్ ఇవ్వడం పై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి సహాయం చేసే దేశానికి డబ్బు ఇస్తే అంతర్జాతీయ సంస్థల పరువు పోతుందని అన్నారు. ఇలా అభ్యంతరం తెలిపిన ఇండియా ఓటింగ్ కు ఎందుకు దూరమయ్యిందో తెలుసా?
పూర్తి కథనం చదవండి01:30 PM (IST) May 10
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఉద్రిక్తత తగ్గించడంలో భారతదేశం ముందడుగు వేయాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. శాంతికి కట్టుబడి ఉండటమే భారతదేశం నిజమైన బలం అని ఆమె అన్నారు.
పూర్తి కథనం చదవండి12:58 PM (IST) May 10
పాకిస్థాన్ చర్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయని భారత వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఆందోళన వ్యక్తం చేసారు. పాక్ బలగాలు భారత్ వైపు కదులుతున్నాయని ఆమె తెలిపారు.
పూర్తి కథనం చదవండి