Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ మూడు నగరాల్లోనే పూర్తి టోర్నీ

IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ మూడు నగరాల్లోనే పూర్తి టోర్నీ

IPL 2025: ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్ లను మూడు వేదికల్లోనే నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది.   

Mahesh Rajamoni | Updated : May 10 2025, 06:42 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

IPL 2025 restart Update: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025 సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు కార్యాచరణను ప్రారంభించినట్లు సమాచారం. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం టోర్నమెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.  

ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు 57 లీగ్ మ్యాచ్‌లు పూర్తి కాగా, 58వ మ్యాచ్‌గా ధర్మశాల వేదికగా మే 2న ప్రారంభమైన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను భద్రతా కారణాలతో 10.1 ఓవర్లకు రద్దు చేశారు.
 

25
Asianet Image

ఎయిర్‌స్పేస్‌పై ఆంక్షలు, వాయుసేన హడావిడి. పఠాన్‌కోట్, జమ్మూ, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో గగనతల హెచ్చరికల మధ్య విమాన రాకపోకలు నిలిపివేశారు. దీంతో పంజాబ్, ఢిల్లీ జట్లతో పాటు బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బందిని వందే భారత్ ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలించారు. 

మూడు నగరాల్లో ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్ లు 

ఐపీఎల్ ను తిరిగి తాత్కాలికంగా వాయిదా వేయగా, వారం తర్వాత తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మూడు దక్షిణ భారత నగరాలను ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు ఎంపిక చేసిందని సమాచారం.  చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను ఈజీగా చేరుకునే గమ్యస్థానాలుగా గుర్తించి, మిగిలిన 16 మ్యాచ్‌లు అందులో క్వాలిఫయర్‌లు, ఎలిమినేటర్, ఫైనల్ లను ఈ మూడు వేదికల్లోనే నిర్వహించే అవకాశముంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం మాత్రమే ఖచ్చితమైన షెడ్యూల్ ఖరారవుతుంది.

Related Articles

India Pakistan War: పోఖ్రాన్‌పై దాడికి యత్నించిన పాక్ డ్రోన్ ను కూల్చేసిన భారత్
India Pakistan War: పోఖ్రాన్‌పై దాడికి యత్నించిన పాక్ డ్రోన్ ను కూల్చేసిన భారత్
India Pakistan War: భార‌త్ పాక్‌ల మ‌ధ్య యుద్ధం ముగిసింది.. అధికారిక ప్రకటన వచ్చేసింది
India Pakistan War: భార‌త్ పాక్‌ల మ‌ధ్య యుద్ధం ముగిసింది.. అధికారిక ప్రకటన వచ్చేసింది
35
Asianet Image

ESPN క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం, మే నెలలో ఐపీఎల్ 2025 టోర్నీ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫ్రాంచైజీలకు ఈ విషయమై ముందుగానే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మే 25 తర్వాత టోర్నమెంట్ విండో పొడిగిస్తే, విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి.
 

45
Asianet Image

ప్రస్తుతానికి, ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. జూన్ 11న జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమవుతున్నాయి. అలాగే, ఇంగ్లాండ్ జట్టు జూన్ 20న భారత్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.
 

55
Asianet Image

విదేశీ ఆటగాళ్లు మే లోపు అందుబాటులో ఉంటారని ఫ్రాంచైజీలు విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, మే 25 తర్వాత కూడా  ఐపీఎల్ షెడ్యూల్ వుంటే ఆ ఆటగాళ్లు అందేబాటులో ఉంటే అవకాశం వుండకపోవచ్చు.

టోర్నమెంట్‌ మళ్లీ ప్రారంభమైతే, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ జరగకుండా ఉండే అవకాశముంది, ఎందుకంటే వేదికలు మారే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో ఇది స్పష్టమవుతోంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
భారత దేశం
 
Recommended Stories
Top Stories