IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ మూడు నగరాల్లోనే పూర్తి టోర్నీ
IPL 2025: ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్ లను మూడు వేదికల్లోనే నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
IPL 2025 restart Update: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025 సీజన్ను తిరిగి ప్రారంభించేందుకు కార్యాచరణను ప్రారంభించినట్లు సమాచారం. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం టోర్నమెంట్ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు 57 లీగ్ మ్యాచ్లు పూర్తి కాగా, 58వ మ్యాచ్గా ధర్మశాల వేదికగా మే 2న ప్రారంభమైన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను భద్రతా కారణాలతో 10.1 ఓవర్లకు రద్దు చేశారు.
ఎయిర్స్పేస్పై ఆంక్షలు, వాయుసేన హడావిడి. పఠాన్కోట్, జమ్మూ, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో గగనతల హెచ్చరికల మధ్య విమాన రాకపోకలు నిలిపివేశారు. దీంతో పంజాబ్, ఢిల్లీ జట్లతో పాటు బ్రాడ్కాస్టింగ్ సిబ్బందిని వందే భారత్ ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలించారు.
మూడు నగరాల్లో ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్ లు
ఐపీఎల్ ను తిరిగి తాత్కాలికంగా వాయిదా వేయగా, వారం తర్వాత తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మూడు దక్షిణ భారత నగరాలను ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ల నిర్వహణకు ఎంపిక చేసిందని సమాచారం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను ఈజీగా చేరుకునే గమ్యస్థానాలుగా గుర్తించి, మిగిలిన 16 మ్యాచ్లు అందులో క్వాలిఫయర్లు, ఎలిమినేటర్, ఫైనల్ లను ఈ మూడు వేదికల్లోనే నిర్వహించే అవకాశముంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం మాత్రమే ఖచ్చితమైన షెడ్యూల్ ఖరారవుతుంది.
ESPN క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం, మే నెలలో ఐపీఎల్ 2025 టోర్నీ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫ్రాంచైజీలకు ఈ విషయమై ముందుగానే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మే 25 తర్వాత టోర్నమెంట్ విండో పొడిగిస్తే, విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి.
ప్రస్తుతానికి, ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. జూన్ 11న జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమవుతున్నాయి. అలాగే, ఇంగ్లాండ్ జట్టు జూన్ 20న భారత్తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్లో పాల్గొననుంది.
విదేశీ ఆటగాళ్లు మే లోపు అందుబాటులో ఉంటారని ఫ్రాంచైజీలు విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, మే 25 తర్వాత కూడా ఐపీఎల్ షెడ్యూల్ వుంటే ఆ ఆటగాళ్లు అందేబాటులో ఉంటే అవకాశం వుండకపోవచ్చు.
టోర్నమెంట్ మళ్లీ ప్రారంభమైతే, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్ జరగకుండా ఉండే అవకాశముంది, ఎందుకంటే వేదికలు మారే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో ఇది స్పష్టమవుతోంది.