MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Districts News
  • Hyderabad
  • India Pakistan War: ట‌పాసులు కాలిస్తే జైలుకే.. ఆదేశాలు జారీ చేసిన పోలీసులు

India Pakistan War: ట‌పాసులు కాలిస్తే జైలుకే.. ఆదేశాలు జారీ చేసిన పోలీసులు

భార‌త్ పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌తీకారంగా పాకిస్థాన్ భార‌త్‌పై దాడుల‌కు దిగుతోంది. అయితే పాక్ దాడులను ఇండియ‌న్ ఆర్మీ ధీటుగా తిప్పుకొడుతోంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా హై అల‌ర్ట్ జారీ చేశారు. 
 

Narender Vaitla | Published : May 10 2025, 02:13 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
diwali crackers

diwali crackers

ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద‌ర్ కుమార్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. 
భారతదేశం–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నగరంలోని మిలిటరీ కాంటోన్‌మెంట్ ప్రాంతాల సమీపంలో పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధించారు.

24
Asianet Image

మే 6, 7 తేదీల్లో భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం  సీవీ ఆనంద్  ఈ ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. ఇది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన చర్యగా అధికారులు పేర్కొన్నారు.

Related Articles

India Pakistan War:  ఆల‌యాలే ల‌క్ష్యంగా పాక్ దాడులు.. చింత‌పుర్ణి ఆల‌య స‌మీపంలో వింత వ‌స్తువు
India Pakistan War: ఆల‌యాలే ల‌క్ష్యంగా పాక్ దాడులు.. చింత‌పుర్ణి ఆల‌య స‌మీపంలో వింత వ‌స్తువు
India Pakistan War : పాకిస్తాన్ కు IMF లోన్.. నిర్ణయాత్మక ఓటింగ్ కు ఇండియా దూరమెందుకుంది?
India Pakistan War : పాకిస్తాన్ కు IMF లోన్.. నిర్ణయాత్మక ఓటింగ్ కు ఇండియా దూరమెందుకుంది?
34
Asianet Image

ఈ నేపధ్యంలో, పటాకుల శబ్దాలు ఊహించని ప్రమాద సంకేతాలుగా కనిపించొచ్చని, పేలుడు లేదా ఉగ్రదాడి జరిగిందన్న అపోహలకు దారితీసే ప్రమాదం ఉందని పోలీస్ కమిషనర్ ఆదేశాల్లో తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల్లో పటాకులు పేల్చడం వల్ల భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉందని, ఇది భద్రతా దళాలపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని ఆయన అన్నారు. 
 

44
Asianet Image

ఇప్పటికే దేశవ్యాప్తంగా భద్రత మరింత కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో, ఇలాంటి చర్యలు ప్రజల భద్రతకు హానికరం కావచ్చని సూచించారు. పబ్లిక్ ప్రదేశాలు, కార్యక్రమాలు, గుమిగూడే చోట్ల ఎలాంటి పటాకులు పేల్చకూడదని, ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
భారత దేశం
హైదరాబాద్
ఆపరేషన్ సింధూర్
యుద్ధం
సాయుధ దళాలు
 
Recommended Stories
Top Stories