India-Pakistan Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బోలెడు అబ్దాలు చెప్పింది. అయితే, ఇండియన్ ఆర్మీ అన్నిటినీ నిజాలతో బట్టబయలు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
India-Pakistan Ceasefire: ఇండియా-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. మే 10 సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల సైన్యాలు ఎలాంటి దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. అయితే, మరోసారి పాక్ కాల్పుల విరమణకు పాల్పడింది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత పాకిస్తాన్ బోలెడు అబద్దాలు చెప్పింది. మే 7 నుంచి ఇండియా పాకిస్తాన్కి బాగా దెబ్బ కొట్టింది. కానీ, తమ ఓటముల్ని దాచుకుని గొప్పగా కనిపించడానికి పాకిస్తాన్ అబద్ధాలు చెబుతూనే ఉంది. భారత ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాకిస్తాన్ బూటకాలన్నీ బట్టబయలు చేసింది. 4 రోజుల్లో పాకిస్తాన్ 14 బూటకాలు ఎలా బట్టబయలయ్యాయో చూద్దాం.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-1
మే 7న ఇండియా పాకిస్తాన్, POKలోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసింది. 100కు పైగా టెర్రరిస్టులు చనిపోయారు. కానీ, పాకిస్తాన్ కేవలం 24 మంది చనిపోయారని, 46 మంది గాయపడ్డారని చెప్పింది.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్ -2
ఇండియా దాడిని తక్కువ చేసి చూపించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ముందుగా మూడు చోట్ల దాడి జరిగిందని చెప్పింది. తర్వాత షెహబాజ్ షరీఫ్ 5 చోట్ల దాడులు జరిగాయని ఒప్పుకున్నారు. ఆ తర్వాత 6 చోట్ల 24 దాడులు జరిగాయని చెప్పారు.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-3
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బ్లూమ్బెర్గ్కి ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్చేశామనీ, ఇండియన్ సైనికుల్ని బంధించామని చెప్పారు. ఆధారాలు అడిగితే సోషల్ మీడియాలో ఉందన్నారు.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-4
పాకిస్తాన్ ఛానెల్ ఇండియాకు చెందిన రెండు రాఫెల్ జెట్స్ని కూల్చేశామని చెప్పింది. కానీ, ఇండియా జెట్స్కి ఏమీ కాలేదు.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-5
ఇండియన్ విమానం కూలిపోయిందని చూపించడానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-6
ఏడుస్తున్న పిల్లలు, ధ్వంసమైన మసీదుల ఫోటోలు పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి గాజా, సిరియా, యెమెన్కి సంబంధించినవి.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-7
ఇండియా డ్రోన్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ని ఇండియన్ డ్రోన్ని ఎందుకు కూల్చలేదని అడిగారు. ఇండియన్ డ్రోన్లు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ లొకేషన్ తెలుసుకోవడానికి వచ్చాయని, పాక్ ఆర్మీ తమ లొకేషన్ బయటపెట్టడం ఇష్టం లేక కూల్చలేదని ఆసిఫ్ చెప్పారు.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-8
బటిండా, అఖ్నూర్లో రెండు మిగ్ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ వీడియో షేర్ చేసింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్లో ఆ వీడియో 21 మే 2021 నాటిదని తేలింది. పంజాబ్లోని మోగాలో మిగ్-21 క్రాష్ అయి పైలట్ చనిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో అది.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-9
ఢిల్లీ ఎయిర్పోర్ట్పై మిస్సైల్ దాడి చేసి ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. నిజానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదానికి సంబంధించినది. PIB ఫ్యాక్ట్ చెక్లో పాకిస్తాన్ బూటకం బట్టబయలైంది.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-10
ఉధంపూర్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశామని పాకిస్తాన్లోని AIK న్యూస్ పాత వీడియో చూపించింది. PIB ఫ్యాక్ట్ చెక్లో ఆ వీడియో ఫేక్ అని తేలింది. రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో 8 మే 2025న కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన వీడియో అది.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-11
ఇండియన్ బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ మీడియా చెప్పింది. పాకిస్తాన్ ఇంటర్నెట్ యూజర్లు షేర్ చేసిన వీడియో ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్లో తేలింది.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-12
ఇండియా S-400, బ్రహ్మోస్ మిస్సైల్ బేస్లను JF-17 ఫైటర్ జెట్తో ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది పూర్తిగా అబద్ధం.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-13
ఇండియా ఎయిర్ఫీల్డ్స్ సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, బటిండా, నలియా, భుజ్లపై దాడి చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది కూడా అబద్ధమే.
పాకిస్తాన్ అబద్ధం నెంబర్-14
ఇండియా మసీదులను ధ్వంసం చేసిందని పాకిస్తాన్ చెప్పింది. కానీ, ఇండియా ఏ మతపరమైన స్థలాన్నీ ధ్వంసం చేయలేదు. ఇండియా సెక్యులర్ దేశం. ఇండియన్ ఆర్మీ ఆ విలువలకు కట్టుబడి ఉంటుంది.