భారతదేశం–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లా చింతపుర్ణి ఆలయం సమీపంలోని బెహద్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి పేలుడు శబ్దం సంభవించింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రదేశం చుట్టూ విద్యుత్ సరఫరా నిలిపివేయబడి ఉండగా ఈ శబ్దం వినిపించింది. 

పేలుడు తరువాత, గ్రామస్థులు ఒక లోహపు వస్తువును గుర్తించారు. అది క్షిపణి భాగంలా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది చింతపుర్ణి ఆలయం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఈ గ్రామం పంజాబ్‌కి ఆనుకొని ఉంది. పంజాబ్‌కు పాకిస్తాన్‌తో 532 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం గ్రామస్తులు ఆ వస్తువు కనిపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా యంత్రాంగం తెలిపిన ప్రకారం, ఆ వస్తువు క్షిప‌ణిలోని భాగంగా అనుమానిస్తున్నారు. అయితే, పూర్తి స్థాయి నిపుణుల బృందం దానిని పరిశీలిస్తోంది.

పాక్ నుంచి ఉత్తర ప్రాంతంపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సమాచారం. అవే సమయంలో పేలిన ఒక రాకెట్ బాగం బెహద్ గ్రామంలో పడిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని ముట్టడి చేసి, గ్రామస్తులకు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి వస్తువులు కనిపించినపుడు దగ్గరకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇవి ప్రమాదకరంగా ఉండే అవకాశముంది.

Scroll to load tweet…

ఇక హమీర్‌పూర్ జిల్లాలో కూడా శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆర్మీ విమానాల శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో లైట్లు ఆపేశారు. హమీర్‌పూర్ కలెక్టర్ అమర్జీత్ సింగ్ అన్ని శాఖలకు ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

Scroll to load tweet…

అలాగే, ప్రజలు సోషల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని తెలిపారు. పుకార్లను షేర్ చేయ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. AI సాయంతో రూపొందించే తప్పుడు వార్తలు, వీడియోలను విశ్వసించవద్దని క‌లెక్ట‌ర్‌ సూచించారు.