తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:13 AM (IST) Apr 26
IPL 2025 CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
11:24 PM (IST) Apr 25
Pakistan Trapped Pok Capture Risk Heightens: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఉగ్రవాదులను, వారి సహాయకులను కూడా మట్టికరిపిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా చేసిన ఒక చర్య వల్ల ఇప్పుడు తానే ట్రాప్ లో చిక్కుకుపోయింది.
పూర్తి కథనం చదవండి10:49 PM (IST) Apr 25
GMC Jammu on High Alert: జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (GMC), జమ్మూ లోని సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందంతా విధుల్లో పూర్తిగా హాజరై ఉండాలనీ, అవసరమైతే వెంటనే సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
10:30 PM (IST) Apr 25
Kashmir terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఇండియాకి వీసాపై వచ్చిన పాకిస్తానీయులు తిరిగి వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి పాకిస్తానీయులు స్వదేశానికి పయనమయ్యారు. ఇక పాక్లో ఉన్న భారతీయులు సైతం ఇండియాకి వచ్చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి
09:33 PM (IST) Apr 25
తమిళ సినీ నటుడు ప్రశాంత్ త్యాగరాజన్ ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద నగల షాపింగ్ కేంద్రం అయిన ప్రశాంత్ రియల్ గోల్డ్ టవర్ వ్యవస్థాపక అధ్యక్షుడు. సినిమాల నుండి వ్యాపార రంగానికి ఆయన చేసిన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది.
పూర్తి కథనం చదవండి08:43 PM (IST) Apr 25
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి సీరియస్ కామెంట్స్ చేసారు.
పూర్తి కథనం చదవండి08:41 PM (IST) Apr 25
కాజోల్, అజయ్ దేవగన్ జంటగా నటించిన సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయితే, మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వాళ్ళ సినిమా ప్రయాణం గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:30 PM (IST) Apr 25
డింపుల్ కపాడియా నుండి రవీనా టాండన్ వరకు, సన్నీ దేఓల్ చాలా మంది నటీమణులతో సంబంధాలు కలిగి ఉన్నారు. చివరికి ఎవరు ఆయన హృదయాన్ని గెలుచుకున్నారు? నటుడి కథ తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి08:30 PM (IST) Apr 25
Warning to kill Modi: పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అధినేత, ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్.. ప్రధాని మోడీని చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
07:55 PM (IST) Apr 25
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ దాయాది ఆర్మీకి షాక్ తగిలింది. బాంబు దాడిలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంతకూ ఈ బాంబు దాడి ఎవరు చేసారో తెలుసా?
పూర్తి కథనం చదవండి
07:35 PM (IST) Apr 25
Free DSC Coaching in AP: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులను అభ్యర్థులు నమోదు చేస్తుండగా.. మరోవైపు కోచింగ్కు సిద్దమవుతున్నారు. ఈక్రమంలో అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షకు సన్నద్దం అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి07:26 PM (IST) Apr 25
ఉగ్రదాడుల సమయంలో ఈ బైసరన్ వ్యాలీలో సైన్యం లేకపోవడంపై కేంద్రం వివరణ ఇచ్చింది. మరి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో భద్రత ఎందుకు కల్పించలేదో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:40 PM (IST) Apr 25
Pahalgam Terrorist Attack: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇండియాతో యుద్దానికి సిద్దమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారతదేశం దాడి చేస్తే ధీటుగా రియాక్ట్ అవుతామని అన్నారు.
పూర్తి కథనం చదవండి06:21 PM (IST) Apr 25
చిన్న పట్ణంలో సినిమా తీయాలనే కలతో, ఆశ, స్నేహం, కథ చెప్పే శక్తిని చాటే హృద్యమైన చిత్రం 'సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్' ఈ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి06:03 PM (IST) Apr 25
పహల్గాం దాడిని ఖండిస్తున్నట్లు నటించిన పాక్ తాజాగా తన అసలు రంగు బైటపెట్టారు. పాక్ ఉపప్రధాని ఉగ్రవాదులను మీడియా ముందే పొగుడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
పూర్తి కథనం చదవండి05:36 PM (IST) Apr 25
AP government Rs 20,000 scheme: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఈ పథకంతో చాలా మందికి ప్రయోజనం కలగనుంది. రేపు మీ అకౌంట్లలో రూ.20 వేల రూపాయలు జమ అవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:12 PM (IST) Apr 25
మ్యూచువల్ ఫండ్స్ అనేవి రోజువారీ పెట్టుబడిదారులకు శక్తివంతమైన మరియు అందుబాటులో ఉండే ఎంపిక. ముఖ్యంగా డిజిటల్ MF కాలిక్యులేటర్తో కలిపి ఉపయోగించినప్పుడు ఈ కలయిక మీ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేయడంలో, కట్టుబడి ఉండటంలో మరియు ట్రాక్లో ఉండటంలో మీకు సహాయపడుతుంది.
పూర్తి కథనం చదవండి04:09 PM (IST) Apr 25
1972 Simla Agreement-Impact on India-Pakistan Relations: 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత కుదిరిన చారిత్రాత్మక 1972 సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ తాజాగా రద్దు చేసింది. అసలు ఏంటీ సిమ్లా ఒప్పందం? భారత్ - పాకిస్తాన్ సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
03:52 PM (IST) Apr 25
Film Shootings Cancelled in Kashmir: ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో సినిమా షూటింగ్లు అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. టాలీవుడ్తోపాటు, బాలీవుడ్, కోలీవుడ్, మాలివుడ్ ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన సినిమా షూటింగ్లను పూర్తిగా రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ లోకేషన్లను ఎంచుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఇక కశ్మీర్ అందాలను కనీసం సినిమాల్లో అయినా చూస్తామా లేదా అన్న అనుమానం కలుగుతోంది.
పూర్తి కథనం చదవండి03:42 PM (IST) Apr 25
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ కస్తూరిరంగన్ కన్నుమూసారు. ఆయన సేవలను గుర్తుచేసుకుని నివాళి అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.
పూర్తి కథనం చదవండి03:26 PM (IST) Apr 25
May 2025 Bank Holidays: మే నెల ప్రారంభానికి ముందే ఆ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయో ఆర్బీఐ ప్రకటించింది. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు ఖాతాదారులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయి. ఏ ఏ తేదీల్లో పనిచేయవు అనే వివరాలు తెలసుకోవడం మంచిది. ఏప్రిల్లో మొత్తం 15 రోజులపాటు సెలవుల కారణంగా బ్యాంకులు మూతబడ్డాయి. ఇక మేలో కూడా 12 రోజులపాటు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.
పూర్తి కథనం చదవండి02:49 PM (IST) Apr 25
Pahalgam Attack India Reaction: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన దారుణ ఉగ్రదాడి దేశాన్నే షేక్ చేసి వేసింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడిలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ప్రమేయం ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఉన్న పాక్ పౌరులందరినీ వెనక్కి పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
02:06 PM (IST) Apr 25
గాన గంధర్వుడిగా గుర్తింపు పొందిన లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కెరీర్ లో 40 వేలపైగా పాటలు పాడారు. అన్ని భాషల్లో బాలు పాడిన పాటలు పాపులర్ అయ్యాయి. చాలా కాలం పాటు బాలు ఇండియాలో టాప్ సింగర్ గా రాణించారు.
పూర్తి కథనం చదవండి12:43 PM (IST) Apr 25
Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. తీవ్రవాదుల జాడ కోసం.. ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ.. ఆర్మీ ముందుకు సాగుతోంది. ఈక్రమంలో లష్కరే టాప్ కమాండన్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ- పోలీసులు ముప్పేట బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ దెబ్బతో పహల్గాం దాడిలో కీలకపాత్రదారి హతమయ్యాడు.
12:10 PM (IST) Apr 25
India-Pakistan Border: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత భారత్ , పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సైన్యం గతంలో జరిగిగన కాల్పుల ఒప్పందం ఉల్లంఘించి బోర్డర్లో ఆర్మీపై కాల్పులకు దిగింది. ఎంఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, పాక్ సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీంతో బుల్లెట్ల సౌండ్లతో బోర్డర్ ఒక్కసారిగా వాతావరణ వేడెక్కింది.
పూర్తి కథనం చదవండి11:46 AM (IST) Apr 25
పెళ్లి తరువాత మరింతగా బిజీ అయ్యింది హీరోయిన్ కీర్తి సురేష్. పెళ్లి అవ్వకముందు కంటే ఇప్పుడే ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్కి ఓ భారీ సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి10:46 AM (IST) Apr 25
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన మారణహోమానికి కారణమైన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఆదిల్ తోకర్, ఆసిఫ్ షేక్ ల ఇళ్లపై భద్రతా బలగాలు బాంబులు కురిపించారు.
పూర్తి కథనం చదవండి10:00 AM (IST) Apr 25
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పతంగి పార్టీ ఎంఐఎం విజయం సాధించింది. కాంగ్రెస్ తో కలిసి కాషాయ పార్టీ బిజెపిని ఓడించింది ఎంఐఎం. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే...
పూర్తి కథనం చదవండి09:25 AM (IST) Apr 25
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కూడా చాలా అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులనే కాదు వారికి సహకరించిన పాకిస్థాన్ ను కూడా వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటికే పాక్ పై అనేక ఆంక్షలు విధించగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందులో కీలకమైన నిర్ణయాలివే అంటూ ప్రచారం జరుగుతోంది. అవేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి07:56 AM (IST) Apr 25
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో శుక్రవారం ప్రమాదకర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడు వడగాలులు, ఉక్కపోత ఉంటుంది... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఎండలుకాసే జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలేవో కూడా తెలిపింది. ఆ జిల్లాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి