Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • National
  • పాక్ దుందుడుకు చర్య.. సొంత ట్రాప్ లో పాకిస్తాన్.. రెండు ముక్కలవుతుందా?

పాక్ దుందుడుకు చర్య.. సొంత ట్రాప్ లో పాకిస్తాన్.. రెండు ముక్కలవుతుందా?

Pakistan Trapped Pok Capture Risk Heightens: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఉగ్రవాదులను, వారి సహాయకులను కూడా మట్టికరిపిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఒక చర్య వల్ల ఇప్పుడు తానే ట్రాప్ లో చిక్కుకుపోయింది.

Mahesh Rajamoni | Published : Apr 25 2025, 11:24 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
సింధు జల ఒప్పందం రద్దు

సింధు జల ఒప్పందం రద్దు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ ఈ సారి పాకిస్తాన్ గట్టిగా బుద్ది చెప్పాలని చూస్తోంది. అయితే, పాక్ దుందుడుకు చర్యలతో తన సొంత ట్రాప్ లోనే చిక్కుకుపోయింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ ను నీటి కష్టాలు తప్పవు. 

25
షిమ్లా ఒప్పందం రద్దు బెదిరింపు

షిమ్లా ఒప్పందం రద్దు బెదిరింపు

భారత్ చర్యలతో ఆగ్రహించిన పాకిస్తాన్, షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని బెదిరించింది. ఆ తర్వాత దానిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ తానే బోనులో చిక్కుకుంది. PoKను కోల్పోయే ప్రమాదంలో పడింది.

35
PoK కార్యకర్త వ్యాఖ్యలు

PoK కార్యకర్త వ్యాఖ్యలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) రాజకీయ కార్యకర్త అమ్జద్ అయూబ్ మిర్జా మాట్లాడుతూ, షిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్ చెబుతోంది. అలా జరిగితే, నియంత్రణ రేఖ (LoC) స్వయంచాలకంగా రద్దవుతుంది. 

LoC రద్దయితే పాకిస్తాన్ మళ్ళీ యుద్ధ విరమణ రేఖ వద్దకు చేరుకుంటుంది. అంటే, భారత్ ఎప్పుడైనా PoKలోకి ప్రవేశించవచ్చు.

45
పహల్గాం ఉగ్రదాడి

పహల్గాం ఉగ్రదాడి

ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు.

55
TRF బాధ్యత

TRF బాధ్యత

ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. నలుగురు బయటి ఉగ్రవాదులతో పాటు ఇద్దరు స్థానికులు కూడా దీనిలో పాల్గొన్నారని సమాచారం.

ఈ క్రమంలోనే పాక్ పై భారత్ గట్ి చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్తాన్ తో అన్ని ఒప్పందాలను కట్ చేసుకుంది. అలాగే, పాకిస్తాన్ పౌరులను వెంటనే దేశం నుంచి తిరిగి వెళ్లాలని ఆదేశించారు. వారి వీసాలను రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
నరేంద్ర మోదీ
అమిత్ షా
 
Recommended Stories
Top Stories