సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన మారణహోమానికి కారణమైన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఆదిల్ తోకర్, ఆసిఫ్ షేక్ ల ఇళ్లపై భద్రతా బలగాలు బాంబులు కురిపించారు. దీంతో ఆ ఇండ్లు నేలమట్టం అయ్యాయి. 

Pahalgam Terrorist Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు తాజాగా వారి ఇంటిని నేలమట్టం చేసారు. అనంత్ నాగ్ జిల్లాలోని అవతిపోరా ప్రాంతంలో గల ఆదిల్ తోకర్, ఆసిఫ్ షేక్ అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లపై గురువారం రాత్రి దాడి చేసారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్‌లో జరిగిన రక్తపాతంలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. పాకిస్థానీ ఉగ్రవాదులకు వీరు మద్దతు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

స్థానికుడైన ఆదిల్ తోకర్ 2018లో అటారీ-వాఘా సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించాడు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అతను సరిహద్దు అవతల ఇంటెన్సివ్ టెర్రర్ శిక్షణ పొంది, గత ఏడాది వ్యాలీలోకి రహస్యంగా తిరిగి వచ్చాడు. తరువాత చొరబాటుదారులకు లాజిస్టిక్స్ సమకూర్చడం, కశ్మీర్ లోని మార్గాలకు సంబంధించిన సమాచారం అందించడం చేసాడని తెలుస్తోంది. పహల్గాంలో ఇటీవలి మారణకాండలో కీలక పాత్ర పోషించాడని భద్రతా వర్గాలు తెలిపాయి.

Scroll to load tweet…

 

లష్కర్-ఎ-తోయిబా (LeT) ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ తోకర్, అలీ భాయ్, హషీం ముసా లకు సంబంధించన ఆఛూకీ తెలిపినవారికి రూ.20 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. పహల్గాం దాడికి ఈ ముగ్గురే ప్రధాన సూత్రధారులని నమ్ముతున్నారు.

పహల్గాం ఉగ్రదాడి

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన దాడి పహల్గాం టెర్రర్ అటాక్.  ఇండియన్ న్యూజిలాండ్ గా పేరుగాంచిన బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కనీసం 28 మంది పర్యాటకులు మరణించగా, పలువురు గాయపడ్డారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఆర్మీ యూనిఫాంలో ఉన్న ఉగ్రవాదులు బాధితులను వారి మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకున్నారు. దాడి చేసినవారు వ్యక్తులను వారి పేర్లతో గుర్తించారని, ఇస్లామిక్ శ్లోకాలు చదవమని కోరి, ఆపై దగ్గర నుండి కాల్పులు జరిపినట్లు తెలిసింది.

మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్ అడవులతో చుట్టుముట్టబడిన సుందరమైన పచ్చిక బయళ్లలో పర్యాటకులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో బహుళ చెక్‌పోస్టులు, సాయుధ గస్తీలతో సహా బలమైన భద్రతా ఉనికి ఉన్నప్పటికీ, దాడి చేసినవారు రక్షణను ఉల్లంఘించి, సాధారణంగా ప్రశాంతమైన పర్యాటక ప్రదేశంలో గందరగోళం సృష్టించగలిగారు.