Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather : నేడు నిప్పుల కుంపటిలా తెలంగాణ... కానీ ఈ ఐదు జిల్లాల్లో మాత్రం వర్షాలు

Weather : నేడు నిప్పుల కుంపటిలా తెలంగాణ... కానీ ఈ ఐదు జిల్లాల్లో మాత్రం వర్షాలు

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో శుక్రవారం ప్రమాదకర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడు వడగాలులు, ఉక్కపోత ఉంటుంది... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఎండలుకాసే జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలేవో కూడా తెలిపింది. ఆ జిల్లాలేవో ఇక్కడ తెలుసుకుందాం. 

Arun Kumar P | Updated : Apr 25 2025, 08:13 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Telangana and Andhra Pradesh Weather

Telangana and Andhra Pradesh Weather

Telangana and Andhra Pradesh Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 44, 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఏప్రిల్ ఎండింగ్ లోనే పరిస్థితి ఇలావుంటే మేలో ఎండలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయంగా ఉదంటున్నారు తెలుగు ప్రజలు. 

ఈ ఎండలకు వడగాలులు, ఉక్కపోత తోడవుతోంది... దీంతో అటు ఇళ్లలో ఉండలేక, ఇటు బయటకు రాలేక తెలుగు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత రెండుమూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది... ఎండలు బాగా పెరిగాయి. సాయంత్రంపూట వర్షం పడి వాతావరణం చల్లబడేది... కానీ వర్షాలు కూడా బంద్ అయ్యాయి. దీంతో తెలంగాణతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారింది. 
 

24
Telangana Weather

Telangana Weather

నేడు తెలంగాణలో వాతావరణ పరిస్థితి : 

తెలంగాణలో గత రెండుమూడు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. భానుడి భగభగలు పెరిగిపోవడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా ఇదే పరిస్ధితి ఉంటుందని... ఈ ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీచేసారు. 

ఆదిలాబాద్, ఆసిఫాబాద్,  నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉండనున్నాయని ప్రకటించారు. అలాగే సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందట. ఈ జిల్లాల్లో తెలంగాణలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్లే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంటే ఈ ఎండలు ప్రమాదకర స్థాయిలో ఉంటాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం అన్నమాట. 

ఇక తెలంగాణలోని మరో 21 జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అంటే రెడ్ అలర్ట్ జిల్లాల్లో కంటే ఇక్కడ ఎండల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. ఈ జిల్లాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది... వడగాలుల తీవ్రత కూడా ఉంటుంది. 
 

34
Telangana Rains

Telangana Rains

తెలంగాణలో వర్షాలు కురిసే జిల్లాలివే :  

ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయినా, వడగాలులు వీచినా సాయంత్రానికి కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.   దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఓ మూడ్నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ తో పాటు రామగుండం, జగిత్యాల, జమ్మికుంట, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

44
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather

నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :

ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ(శుక్రవారం) కొన్నిజిల్లాలు మధ్యాహ్నం నిప్పుల కుంపటిలా మారినా సాయంత్రానికి చిరు జల్లులతో చల్లబడతాయి. రాయలసీమ జిల్లాల్లో సాధారణంగా ఎండలు అధికంగా కాస్తాయి... ఇప్పుడు నడి వేసవిలోకి చేరుకోవడంతో భానుడి ప్రతాపం మరింత పెరిగింది. ముఖ్యంగా నంద్యాల, తిరుపతితో పాటు చిత్తూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల నమోదుకానున్నాయట. ఇక మిగతా జిల్లాల్లో ఈస్థాయిలో కాకున్నా మండుటెండలే ఉంటాయని తెలిపారు. 

ఇవాళ, రేపు (శుక్ర, శనివారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎండావాన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని... విశాఖపట్నంతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలో సాయంత్రం వాతావరణం పొగమంచు వాతావరణం ఉంటుందని  తెలిపారు. ఇక మరికొన్ని జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుందని ప్రకటించారు. ఇలా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉంది... కాబట్టి పొలాల్లో పనిచేసుకునే రైతులు, కూలీలు, బయట ఉండేవాళ్లు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ సూచించింది. 


 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
భారత దేశం
 
Recommended Stories
Top Stories