Rakul Preet : ‘ఎన్టీఆర్, చరణ్ వల్లే.. ఆ సినిమా చేయలేకపోయా’.. ఎనిమిదేళ్లకు రివీల్ చేసిన రకుల్ ప్రీత్!

First Published Jan 14, 2024, 8:35 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh ఏడాది కింద బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హిందీ చిత్రాల గురించి మాట్లాడింది. 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. సౌత్, నార్త్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 

దక్షిణాదిలో బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. సౌత్ లో దాదాపు 15 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంది. ఈ గ్యాప్ లో తనకు బాలీవుడ్ నుంచి కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చింది. 
 

Latest Videos


బాలీవుడ్ లో తను మొదట చేసిన చిత్రం ‘యారియన్’ Yaariyan. ఈ మూవీ 2014లో విడుదలైంది. రకుల్ కు బాలీవుడ్ లో ఇదే తొలిచిత్రం. దీంతో 2024 ప్రారంభంతో బాలీవుడ్ లో పదేళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకుంది.
 

ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో తన కెరీర్ లో హిందీ సినిమాల గురించి మాట్లాడింది. తను బాలీవుడ్ హిట్ మూవీ, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ MS Dhoni బయోపిక్ MS Dhoni Movie లో నటించే ఛాన్స్ ను వదులుకున్నట్టు తెలిపింది. 
 

అదే సమయంలో ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, రామ్ చరణ్ తో ‘ధృవ’ సినిమాలు చేస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాక ‘ఎంఎస్ ధోనీ : అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రాన్ని వదులుకున్నట్టు తెలిపింది. లేదంటే దిశాపటానీ పాత్రలో తానే నటించాల్సిందని గుర్తుచేసింది... ఆ సినిమా చేసి ఉంటే బాలీవుడ్ లో మంచి కెరీర్ ను చూసి ఉండేది. కానీ ఎన్టీఆర్, చరణ్, బన్నీ వల్ల టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రకుల్...
 

ఇంకా... తొలుత ఆ సినిమాకు తనే సంతకం చేసినా సినిమా చేయలేకపోయాయని చెప్పుకొచ్చింది. యూనిట్ తన షెడ్యూల్‌ను 20 రోజులు పెంచడం, ఆ సమయంలో ‘బ్రూస్ లీ’ విడుదల కానుండటం.. అందులో ఒక పాటను చిత్రీకరించాల్సి ఉండటం, అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో ఒకేసారి రెండు సినిమాలు చేయడంతో డేట్స్ ఇవ్వలేకపోయాయని చెప్పారు. అలా ఆ అవకాశం దూరమైందన్నారు. 
 

click me!