మణికంఠ గుంటనక్క! సైలెంట్ గా టార్గెట్ చేసిన సీత

Oct 5, 2024, 10:59 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. హౌస్ లో రోజుకో  సినిమా చూపిస్తున్నారు. ప్రస్తుతం అందరి టార్గెట్ ఒక్కటే.. అందరూ భయపడేది ఒక్కరికే. అతనే సింపతీ స్థార్ మణికంఠ. ఎలాగైనా మణికంఠను ఇంటి నుంచి పంపించాలని పట్టుదలతో ఉన్నారు హౌస్ మేట్స్. అయితే మణికంఠకు ఓటింగ్ బాగుందని తెలిసిన తర్వాత అందరికీ జ్ఞానోదయం అయ్యింది. సింపతీతో మణి ఓట్లు సాధిస్తున్నాడని అతన్ని టార్గెట్ చేస్తున్నారు. నువ్వు ఆడియన్స్ ముందు మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావంటూ.. సీత డైరెక్ట్ గా అనేసింది. అందరూ మణిని కార్నర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు దీని వల్ల ఓటింగ్ పెరగడంతో పాటు అతను టాప్- 5లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.