పవన్ కళ్యాణ్, మా చిన్న చెల్లి పుట్టేనాటికి నేను చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళాను. ఎప్పుడో ఒకసారి సెలవులకు వీళ్ళను కలవడానికి కుదిరేది. దాని వలన పవన్ కళ్యాణ్ ని నేను చాలా మిస్ అయ్యేవాడిని.. అని అన్నారు. చిరంజీవి ఓ సందర్భంలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా గతంలో పవన్ కళ్యాణ్-చిరంజీవి రాజకీయం విభేదించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీఆర్పీ పార్టీని చిరంజీవి విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కలపడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. సొంత అన్నయ్య మీద విమర్శలు గుప్పించాడు.