బిగ్ బాస్ నుంచి ఆదిత్య ఔట్.. మెగా చీఫ్ గా నబిల్, కాలర్ ఎగరేసిన మణికంఠ, పృధ్వీకి అన్యాయం..?

By Mahesh JujjuriFirst Published Oct 3, 2024, 11:10 PM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తాజా ఎపిసోడ్ లో అనుకోని ట్విస్ట్ లు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మొదటి మెగాచీఫ్ గా నబిల్ ఎంపిక కాగా, ఆదిత్య ఓం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్  బాస్ తెలుగు సీజన్ 8 తాజా ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా సాగింది. ట్విస్ట్ మీద ట్వీస్ట్ లతో బిగ్ బాస్ అదరగొట్టాడు. 

బిగ్ బాస్ ట్విస్ట్ లకు ఆడియన్స్ మతులుపోతున్నాయి. లిమిట్ లెస్ ట్వీస్ట్ ల తో బిగ్ బాస్ అదరగొడుతున్నాడు. తాజా ఎపిసోడ్ లో అనుకోని ట్వీస్ట్ లు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే మెగా చీఫ్ ఎన్నికలో ట్వీస్ట్ ల మీద ట్వీస్ట్ లు కనిపించాయి. ప్రేరణ, నబిల్ మధ్యలో మెగా చీఫ్ కంటెండర్ గా హౌస్ అంతా నబిల్ కే ఓటు వేశారు. దాంతో ముందే సెలక్ట్ అయ్యి ఉన్న పృధ్వీతో మెగా కంటెండర్ గా  గెలిచిన నబిల్ కు టఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. 

Latest Videos

అయితే ఈ టాస్క్ లో ముందుగా దూసుకువచ్చి కంప్లీట్ చేశాడు పృధ్వీ. అయితే అంతా సక్రమంగా చేస్తున్నాడుఅనుకున్న టైమ్ లో .. అతను ఆ టాస్క్ లో భాగంగా పెట్టాల్సిన ఐయామ్ మెగా చీఫ్ స్పెల్లింగ్ ను కాస్త రాంగ్ పెట్టాడు. అది కూసుకోకుండా ఫైనల్ బెల్ మోగించాడు. అయితే ఈలోపు నబిల్ కాస్త నిధానంగా అయినా.. పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. దాంతో ముందుగా టాస్క్ కంప్లీట్ చేసిన పృధ్వీ కాకుండా.. కరెక్ట్ ఆర్డర్ లో సెట్ చేసిన నబిల్ కు విన్నింగ్ ఇచ్చింది.. సంచాలక్ ప్రేరణ. 

దాంతో ఈ విషయంలో యష్మి చాలా అప్ సెట్ అయ్యింది. బాగా డిస్సపాయింట్ అయ్యి బోరున ఏడ్చింది. ఆమె సెట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. ఆమెతో పాటు పృధ్వీని బాగా అభిమానిస్తున్న విష్ణు ప్రియ కూడా ఈ విషయంలో డిస్సపాయింట్ అయ్యింది. ఇక హౌస్ ల రెండు మూడు క్లాన్ లు లేవు.. ఒక్కటే క్లాన్.. హౌస్ మొత్తానికి ఒక్కడే చీఫ్ అతనే మెగా చీఫ్ అవుతాడు. ఇక బిగ్ బాస్ తెలుగు  సీజన్ 8 మొదటి మెగాచీఫ్ గా నబిల్ సెలక్ట్ అయ్యాడు. ఆనందం తట్టుకోలేకపోయాడు. 

ఇక ఈ విషయంలో చాలా అప్ సెట్ అయ్యాడు పృధ్వీ.. కాని దాన్ని కనిపించకుండా కవర్ చేసుకున్నాడు. ఇక ఈక్రమంలోనే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం బిగ్ బాస్ నుంచిబయటకు వెళ్ళిపోవడానికినామినేట్అయి ఉన్న సభ్యుల నుంచి ఒకరు ఇప్పుడు బయటకు వెళ్ళిపోబోతున్నారు అంటూ ట్వీస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఉన్న వారిలో నిఖిల్, నబిల్ తో పాటు మణింకఠకు కూడా భారీగా ఓటింగ్ రావడంతో వారు ఈ మిడ్ ఎలిమినేన్స్ నుంచి బయటపడ్డారు. 

ఇక విష్ణు ప్రియ, నైనిక, ఆదిత్య ఓం లను వరుసగా నిలబెట్టి ఎవరు హౌస్ నుంచి వెళ్ళబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అభిప్రాయాలు అడిగాడు. దాంతో ఎక్కువ మంది ఆధిత్యను సెలక్ట్ చేసుకున్నారు. ఇక ఓటింగ్ లో కూడా ఆధిత్య ఓం చివరిలో ఉండటంతో పాటు..హౌస్ మెట్స్ అనుకున్నది నిజం అయ్యింది. ఆధిత్య ఓం బిగ్ బాస్ హౌస్ ను వీడి బయటకు వెళ్ళపోయాడు. 

కాగా అతను సీక్రెట్ రూమ్ లోకి వెళ్లే  అవకాశం కూడా లేకపోలేదు. మిడ్ వీక్ లో వెళ్ళిన వారిని సీక్రేట్ రూమ్ లో పెడతారు. మరి ఆధిత్య ఓం పరిస్థితి ఏంటి.. బయటకు వెళ్ళిపోయినట్టా..? ఏక సీక్రేట్ రూమ్ కు పంపించారా అనేది చూడాలి. తరువాత ఎపిసోడ్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆదిత్య ఓం వెళ్ళిపోవడంతో నైనిక, విష్ణు కూల్ అయ్యారు. ఇక వీకెండ్ ఎలిమినేషన్ గండం మాత్రం వీరిని వెంటాడుతోంది. 

అయితే ఇక్కడే మరో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మణికంఠ గురించి మనం అనుకుంటున్నట్టుగానే హౌస్ అంతా టార్గెట్ చయడం వల్ల.. అతనిఓటింగ్ భారీగా పెరుగుతుంది. అమాయకుడిని బలి చేస్తున్నారంటూ.. ప్రతీ వారం నామినేషన్స్ లో ఉంటున్న మణిని.. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాపాడుకుంటున్నారు. ఇంట్లో కార్నర్ చేస్తే.. అది అతనికి ప్లాస్ అవుతుంది. ఈ రోజు బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం అది నిరూపితం అయ్యిందని చెప్పవచ్చు.  

సో ముందు ముందు ఇంకెన్ని ట్వీస్ట్ లు ఉంటాయో చూడాలి. బిగ్ బాస్ మరో విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు మిడ్ ఎలిమినేషన్ జరగింది. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నవారిలో కూడా ఒకరు వీకెండ్ లో వెళ్ళిపోతారు అని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ లో ఆధిత్య వెల్ళిపోయారు.. ఇక రెండో వ్యక్తి ఎవరు అనేది చూడాలి. నైనిక వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 


 

click me!